Telugu Global
Telangana

రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం.. బాంబు పేల్చిన ఏలేటి

రేవంత్‌ రెడ్డి పదే పదే తాను హై టెన్షన్ వైర్‌నని చెప్పుకుంటున్నాడని, మరీ మిగతా వాళ్లు మల్లెతీగలా అంటూ ఎద్దేవా చేశారు ఏలేటి. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే.. తాము ఎలాంటి వైర్లమో రేవంత్ రెడ్డికి తెలుస్తుందన్నారు.

రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం.. బాంబు పేల్చిన ఏలేటి
X

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి బాంబు పేల్చారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల్లో ఓటుకు నోటు కేసు విచారణకు వస్తుందని, తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీకి ఎదురైనట్లు ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొంటారని జోస్యం చెప్పారు. రేవంత్‌ కూడా ఎల్లో కాలేజీకి చెందిన వ్యక్తేనన్నారు ఏలేటి.

రేవంత్‌ రెడ్డి పదే పదే తాను హై టెన్షన్ వైర్‌నని చెప్పుకుంటున్నాడని, మరీ మిగతా వాళ్లు మల్లెతీగలా అంటూ ఎద్దేవా చేశారు ఏలేటి. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే.. తాము ఎలాంటి వైర్లమో రేవంత్ రెడ్డికి తెలుస్తుందన్నారు. మోడీని విమర్శించే స్థాయి రేవంత్‌ రెడ్డికి లేదన్నారు. కాంగ్రెస్‌ 14 సీట్లు గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానన్నారు.

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలన్నారు ఏలేటి. ఇటీవల కాలంలో ఆయనలో అభద్రతా భావం, ఆందోళన కనిపిస్తున్నాయన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రచారానికి ఎలా వెళ్తున్నారని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు ఏలేటి.

First Published:  21 April 2024 4:13 AM GMT
Next Story