Telugu Global
Telangana

కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన జర్నలిస్టు అర్నబ్ గోస్వామి

రిపబ్లిక్ టీవీ అధినేత, జర్నలిస్టు అర్నబ్ గోస్వామి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఆయన‌ వారసత్వ రాజకీయాల్లోంచి వచ్చిన వ్యక్తి కాదు. కింది స్థాయి నుంచి కష్టపడి పై స్థాయికి చేరుకున్న వ్యక్తి అని చెప్పిన అర్నబ్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా నరేంద్ర మోడీకి టఫ్ ఫైట్ ఇచ్చి తీరుతాడు అని చెప్పారు.

కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన జర్నలిస్టు అర్నబ్ గోస్వామి
X

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసిన సందర్భంగా రిపబ్లిక్ టీవీలో డిబేట్ జరిగింది. అర్నబ్ గోస్వామి నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీఆరెస్ నుంచి క్రిశాంక్ , బీజేపీ మహిళా నేత సంజు వర్మ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంజూ వర్మ కేసీఆర్ పట్ల చులకనగా మాట్లాడారు. ఆయనను 'రోగ్' అంటూ పరుష పదజాలంతో దూషించారు. దానికి క్రిశాంక్ ప్రతిభావంతంగా జవాబిచ్చినప్పటికీ ఆమె చాలా చీప్ గా మాట్లాడటం ప్రారంభించారు.దాంతో కార్యక్రమ నిర్వాహకులు అర్నబ్ గో స్వామి ఆమెకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. కేసీఆర్ ను చులకన చేయడం సరైంది కాదని ఆయన ప్రతిభావంతుడైన రాజకీయ నాయకుడంటూ ఆమె నోరు మూశారు.

కేసీఆర్ ను తక్కువ అంచనా వేయకండి. ఆయన పైనుంచి ఊడిపడిన, వారసత్వ రాజకీయాల్లోంచి వచ్చిన వ్యక్తి కాదు. కింది స్థాయి నుంచి కష్టపడి పై స్థాయికి చేరుకున్న వ్యక్తి అంటూ అర్నబ్ అన్నారు. ఆయన అందరికీలాగా ఫోటోలకు ఫోజులిచ్చే వ్యక్తి కాదు. ట్విట్టర్ లో టైం పాస్ చేసే వ్యక్తి కాదు. ఆయన ఆచరాణాత్మకమైన రాజకీయ నాయకుడు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా నరేంద్ర మోడీకి టఫ్ ఫైట్ ఇచ్చి తీరుతాడు అని అర్నబ్ గోస్వామి అనడంతో బీజేపీ నాయకురాలు సంజూ వర్మ నోరు మూత పడింది. ఏం మాట్లాడాలో అమేకు కొద్ది సేపు అర్దం కాలేదు.

అయితే బీజేపీ ఛానల్ గా ముద్రపడ్డ రిపబ్లిక్ టీవీలో, బిజెపికి కరుడుగట్టిన అభిమాని అయిన అర్నబ్ గోస్వామి కేసీఆర్ ను పొగడటం సోషల్ మీడియాలో సంచలనమైంది.

First Published:  7 Oct 2022 12:42 PM GMT
Next Story