Telugu Global
Telangana

బీజేపీ కుటుంబ రాజకీయాలు, తెలంగాణపై మోడీ వివక్ష.... హైదరాబాద్ లో పోస్టర్లు

వివిధ బిజెపి పాలిత రాష్ట్రాల్లోని అవినీతిని హైలైట్ చేస్తూ, భారతదేశ మ్యాప్‌తో కూడిన హోర్డింగ్‌లో “బిజెపి విజయాలు. మోడీ జీకి స్వాగతం”. అని ఉండగా, సికింద్రాబాద్‌లో క్రియాశీల రాజకీయాల్లో ఉన్న పలువురు బీజేపీ నేతలు, వారి పిల్లల చిత్రాలతో కూడిన మరో హోర్డింగ్‌లో “పరివార్ మోడీ జీని స్వాగతిస్తోంది” అని రాసి ఉంది.

బీజేపీ కుటుంబ రాజకీయాలు, తెలంగాణపై మోడీ వివక్ష.... హైదరాబాద్ లో పోస్టర్లు
X

నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయనకు విమర్శలతో స్వాగతం పలుకుతూ పోస్టర్లు వెలిశాయి. వంశపారంపర్య రాజకీయాలు, అవినీతిపై బీజేపీపై విమర్శలు గుప్పించే హోర్డింగ్‌లు, పోస్టర్లు నగరంలో వెలుగుచూశాయి. సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా శనివారం ప్రధాని ప్రసంగించనున్న పరేడ్ గ్రౌండ్స్ సమీపంలో, అనేక హోర్డింగ్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.

వివిధ బిజెపి పాలిత రాష్ట్రాల్లోని అవినీతిని హైలైట్ చేస్తూ, భారతదేశ మ్యాప్‌తో కూడిన హోర్డింగ్‌లో “బిజెపి విజయాలు. మోడీ జీకి స్వాగతం”. అని ఉండగా, సికింద్రాబాద్‌లో క్రియాశీల రాజకీయాల్లో ఉన్న పలువురు బీజేపీ నేతలు, వారి పిల్లల చిత్రాలతో కూడిన మరో హోర్డింగ్‌లో “పరివార్ మోడీ జీని స్వాగతిస్తోంది” అని రాసి ఉంది.

సికింద్రాబాద్‌లోని వివిధ చోట్ల హోర్డింగ్‌లు బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తే, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో మెట్రో పిల్లర్లపై వేసిన పోస్టర్లు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రణాళికలను బట్టబయలు చేశాయి.

‘సేవ్ సింగరేణి అండ్ బీజేపీ హటావో, సింగరేణి బచావో’ అంటూ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పోస్టర్లు వేశారు. మరి కొన్ని ప్రాంతాలలో, “SCCLని ప్రైవేటీకరించడానికి BJP పాల్పడుతున్న కుట్రలను ఎదిరిస్తాము, సింగరేణిని రక్షించుకుంటాము” అని రాసి ఉన్న పోస్టర్లు వేశారు.

First Published:  8 April 2023 2:49 AM GMT
Next Story