Telugu Global
Telangana

ఆరు గ్యారంటీలపై మరో కమిటీ.. ఛైర్మన్‌గా భట్టి!

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. ఆరు గ్యారంటీలు సహా రేషన్ కార్డుల కోసం దాదాపు కోటి 25 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.

ఆరు గ్యారంటీలపై మరో కమిటీ.. ఛైర్మన్‌గా భట్టి!
X

ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో ఆరు గ్యారంటీల అమలుపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకోసం కేబినెట్‌ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

ఈ సబ్‌ కమిటీలో స‌భ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఆరు పథకాలు లబ్ధిదారులకు అందించే బాధ్యతను ఈ కమిటీ తీసుకోనుంది.

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. ఆరు గ్యారంటీలు సహా రేషన్ కార్డుల కోసం దాదాపు కోటి 25 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 17 లోపు డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి కానుంది. తర్వాత పథకాలకు సంబంధించిన గైడ్‌లైన్స్ ఖరారు చేసి, లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

First Published:  8 Jan 2024 12:17 PM GMT
Next Story