Telugu Global
Telangana

వాళ్ళ పిచ్చి పీక్స్ కు వెళ్ళిందా ?

పుష్ప 2 మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ రాకపోవడం పట్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కోపమొచ్చింది. వెంటనే కట్టగట్టుకొని వచ్చి గీతా ఆర్ట్స్ సంస్థ ముందు ధర్నాకు దిగారు.

వాళ్ళ పిచ్చి పీక్స్ కు వెళ్ళిందా ?
X

పైన కనపడుతున్న ఫోటోలో కనిపిస్తున్న‌ వ్యక్తులు చేస్తున్న ధర్నా, ఉద్యోగాల కోసం కాదు.... ధరలు తగ్గాలని కాదు....ఆకలి తీర్చాలనో , సమస్యలు పరిష్కరించాలనో కాదు.....ఇంకా షూటింగే ప్రారంభంకాని వాళ్ళ హీరో మూవీ అప్డేట్స్ కావాలని ఆ ధర్నా.

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయల కలెక్షన్లు సంపాదించి పెట్టింది. ఇక దాని తర్వాత పుష్ప 2 మూవీ వస్తోందని దర్శకుడు సుకుమార్ ప్రకటించారు. అయితే ఆ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ రాకపోవడం పట్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కోపమొచ్చింది. వెంటనే కట్టగట్టుకొని వచ్చి గీతా ఆర్ట్స్ సంస్థ ముందు ధర్నాకు దిగారు.

పుష్ప మూవీ తీసింది, సెకండ్ పార్ట్ తీయబోయేది మైత్రి మూవీ మేకర్స్... ఫ్యాన్స్ అతికాకపోతే ధర్నా అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ ముందు చేయడమేంటో వారికే అర్దం కావాలి. అక్కడొక్క చోటే కాదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE), కేరళ, తమిళనాడు, కర్నాటకలలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధర్నాలకు దిగారు.

ఫ్యాన్స్ అతి కాకపోతే...అసలు మూవీ అప్డేట్స్ కోసం ఈ నిరసనలేంటో ? గతంలో ప్రభాస్ మూవీ రాధేశ్యాం విషయంలోనూ ప్రభాస్ అభిమానులు ఇలాగే వ్యవహరించారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆ సినిమాలతో కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటే పిచ్చెక్కి రోడ్లెక్కే ఫ్యాన్స్ ఉన్నవి పోగొట్టుకొని జీవితంలో ఎందుకూ కొరగాకుండా పోతూ ఉన్నారు. ఇలా హీరోల కోసం రోడ్లెక్కి యువత వాళ్ళ జీవితాలను నాశనం చేసుకు౦టూ ఉంటే హీరోలు వారికి నచ్చజెప్పరా ? ఆ హీరోలకు కనీస బాధ్యత లేదా ? లేదంటే ఇది కూడా మూవీ ప్రచారం కోసం సాగే స్క్రీన్ ప్లే లో భాగమా ?

First Published:  14 Nov 2022 6:00 AM GMT
Next Story