Telugu Global
Telangana

అవార్డు ప్రకటన తర్వాత బన్నీకి తొలి సన్మానం

బన్నీని ఆత్మీయంగా సన్మానించారు బ్రహ్మానందం. జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైనందుకు అభినందించారు. బ్రహ్మానందం కుటుంబంతో అల్లు అర్జున్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అవార్డు ప్రకటన తర్వాత బన్నీకి తొలి సన్మానం
X

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటన తర్వాత అల్లు అర్జున్ ఆ సంబరాన్ని పుష్ప టీమ్ తో జరుపుకోవడం అందరం చూశాం. అవార్డు రావడానికి కారణమైన సినిమా పుష్ప దర్శకుడు సుకుమార్ ని ఆలింగనం చేసుకుని తన ఆనందాన్ని పంచుకున్నారు బన్నీ. అయితే అవార్డు ప్రకటన తర్వాత ఆయనకు తొలిసారి పూలమాల వేసి, శాలువా కప్పిన ఘనత మాత్రం బ్రహ్మానందంకి దక్కింది. ఆ సన్మానం కూడా బ్రహ్మానందం ఇంట్లోనే జరగడం విశేషం.


బ్రహ్మీ ఇంటికి బన్నీ..

జాతీయ అవార్డుల ప్రకటన రోజు ఇంటి బయటకు వచ్చి మీడియాకు ఇలా కనిపించి అలా మాయమయ్యారు బన్నీ. తనకు నోట మాటలు రావట్లేదని, మరోసారి మాట్లాడతానంటూ సైగలతోనే వివరించారు. ఈరోజు ఆయన బ్రహ్మానందం ఇంటికి వెళ్లారు. ఇటీవల బ్రహ్మానందం రెండో కొడుకు సిద్దార్థ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ రోజు పెళ్లికి హాజరు కాలేకపోయారు బన్నీ. అందుకే ఈరోజు వారి ఇంటికి వెళ్లి మరీ పలకరించి వచ్చారు.

నూతన దంపతులు సిద్దార్థ్, ఐశ్వర్యకు శుభాకాంక్షలు తెలిపేందుకు బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన బన్నీ.. దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా బన్నీని ఆత్మీయంగా సన్మానించారు బ్రహ్మానందం. జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైనందుకు అభినందించారు. బ్రహ్మానందం కుటుంబంతో అల్లు అర్జున్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


First Published:  25 Aug 2023 12:57 PM GMT
Next Story