Telugu Global
Telangana

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌లో యువ‌కుడి దుర్మ‌ర‌ణం.. - మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు

ప‌వ‌న్ అభిమానులు కూస రాజ్‌కుమార్ (20), జ‌క్కుల అంజి బైక్‌పై అనుసరించారు. జ‌గిత్యాల జిల్లా వెల్ల‌టూరు మండ‌లం కిష‌న్‌రావుపేట వ‌ద్ద వారు అత్యుత్సాహంతో ప‌వ‌న్ కాన్వాయ్‌ని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేశారు.

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌లో యువ‌కుడి దుర్మ‌ర‌ణం.. - మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు
X

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన ప‌ర్య‌ట‌న‌లో విషాదం చోటుచేసుకుంది. ధ‌ర్మ‌పురిలో పూజ‌ల అనంత‌రం రాష్ట్ర ర‌హ‌దారిపై మంగ‌ళ‌వారం రాత్రి ప‌ర్య‌ట‌న సాగుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం జ‌గిత్యాల జిల్లా కొండ‌గ‌ట్టులో అంజ‌న్న ఆలయాన్ని ద‌ర్శించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న ప్ర‌చార వాహ‌నం `వారాహి`కి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.

ఆ త‌ర్వాత పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అనంత‌రం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ధ‌ర్మ‌పురికి వెళ్లి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం తిరుగు ప్ర‌యాణంలో ప‌వ‌న్ అభిమానులు కూస రాజ్‌కుమార్ (20), జ‌క్కుల అంజి బైక్‌పై అనుసరించారు. జ‌గిత్యాల జిల్లా వెల్ల‌టూరు మండ‌లం కిష‌న్‌రావుపేట వ‌ద్ద వారు అత్యుత్సాహంతో ప‌వ‌న్ కాన్వాయ్‌ని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఎదురుగా వ‌స్తున్న కారును, మ‌రోబైక్‌ను వీరు ఢీకొట్టారు. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన రాజ్‌కుమార్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. అత‌ని బైక్‌పై ఉన్న అంజికి, ఎదురు బైక్‌పై వస్తున్న బొలిశెట్టి శ్రీ‌నివాస్‌, నీలం సాగ‌ర్‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి.

First Published:  25 Jan 2023 4:08 AM GMT
Next Story