Telugu Global
Telangana

కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేసినందుకు పార్టీనుంచి సస్పెండ్ అయిన బీజేపీ నేత

మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్లా జిల్లాలోని పలు గ్రామాలకు కాళేశ్వర జలాలు అందాయి. దాంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఓ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నాయకుడు బైరినేని రాము కూడా రైతులతో కలిసి కాళేశ్వర జలాలకు పూజలు నిర్వహించి,కేసీఆర్‌, కేటీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.

కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేసినందుకు పార్టీనుంచి సస్పెండ్ అయిన బీజేపీ నేత
X

రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌, బాలమల్లుపల్లె, నర్సింహుపల్లె గ్రామాల చెరువులకు రంగనాయకసాగర్‌ కాలువ ద్వారా కాళేశ్వర జలాలు ఇవ్వాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం ఆయా గ్రామాల ప్రజలు, చిన్నలింగాపూర్‌ ఎంపీటీసీ, బీజేపీ నేత బైరినేని రాము తదితరులు మంత్రి కేటీఆర్ ను కలిసి కోరారు. ప్రజల కోరికను తీరుస్తూ కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఈ అన్ని గ్రామాలకు కాళేశ్వర జలాలు అందాయి.

దాంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఓ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నాయకుడు బైరినేని రాము కూడా రైతులతో కలిసి కాళేశ్వర జలాలకు పూజలు నిర్వహించి,కేసీఆర్‌, కేటీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమం ప్రతిరోజూ కేసీఆర్, కేటీఆర్ లపై ఒంటికాలుపై లేచే బీజేపీ అగ్రనాయకులకు ఆగ్రహం తెప్పించింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ వెంటనే రంగంలోకి దిగాడు. ఆగమేఘాల మీద ఎంపీటీసీ బైరినేని రాము పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నాడని పేర్కొంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు.

First Published:  7 March 2023 5:28 AM GMT
Next Story