Telugu Global
Telangana

4 ఎమ్మెల్సీ స్థానాలు.. కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్లే..!

ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 18లోగా నామినేషన్లు స్వీకరించనున్నారు. దీంతో ఇవాళో, రేపో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారని సమాచారం.

4 ఎమ్మెల్సీ స్థానాలు.. కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్లే..!
X

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో రెండు, గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దావోస్‌ పర్యటనకు బయల్దేరే ముందు ఈ విషయంపై అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం.

ఎమ్మెల్యే కోటాలో టీపీసీసీ వర్కింగ్ మహేష్‌ కుమార్ గౌడ్‌, అద్దంకి దయాకర్‌ల పేర్లు దాదాపు ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 18లోగా నామినేషన్లు స్వీకరించనున్నారు. దీంతో ఇవాళో, రేపో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారని సమాచారం. 29న ఈ రెండు స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండింటికి విడివిడిగా ఎన్నికలు జరిగితే రెండు స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలో చేరనున్నాయి.

ఇక గవర్నర్ కోటాలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతో పాటు జాఫర్ జావేద్ పేర్లు వినిపిస్తున్నాయి. కోదండరాంకు ఎమ్మెల్సీని చేసి విద్యాశాఖమంత్రి పదవి ఇస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

First Published:  15 Jan 2024 8:42 AM GMT
Next Story