Telugu Global
Telangana

ముగ్గు గొడ‌వ‌కు నిండు ప్రాణం బ‌లి

రెండు కుటుంబాల మ‌ధ్య జ‌రిగిన వాగ్వివాదం ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. రెండు కుటుంబాల వారూ ఒక‌రిపై మ‌రొక‌రు పిడిగుద్దులు గుద్దుకుంటూ దాడి చేసుకున్నారు.

ముగ్గు గొడ‌వ‌కు నిండు ప్రాణం బ‌లి
X

ముగ్గు విష‌యంలో జ‌రిగిన గొడ‌వ ఒక నిండు ప్రాణం తీసింది. పాత‌బ‌స్తీలోని ఛ‌త్రినాక పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని శివాజీన‌గ‌ర్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్‌స్టేష‌న్‌ పరిధిలోని శివాజీ నగర్ ప్రాంతంలో మాణిక్ ప్రభు తల్లి తన ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్లింది. కాసేపటి తర్వాత.. పక్కనే నివాసం ఉంటున్న దుర్గేష్ ఇంటి నుంచి నీరు రావడంతో మాణిక్ ప్రభు తల్లి వేసిన ముగ్గు తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్ర‌మంలో రెండు కుటుంబాల మ‌ధ్య జ‌రిగిన వాగ్వివాదం ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. రెండు కుటుంబాల వారూ ఒక‌రిపై మ‌రొక‌రు పిడిగుద్దులు గుద్దుకుంటూ దాడి చేసుకున్నారు.

ఈ ఘ‌ర్ష‌ణ‌లో మాణిక్ ప్ర‌భు (35) తీవ్రంగా గాయ‌ప‌డి ఒక్క‌సారిగా స్పృహ కోల్పోయాడు. కుటుంబ స‌భ్యులు అత‌న్ని లేపేందుకు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. దీంతో వారు హుటాహుటిన అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేసినా అప్ప‌టికే మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న‌పై ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  5 July 2023 2:49 AM GMT
Next Story