Telugu Global
Telangana

త‌వ్వే కొద్దీ.. నిందితులు..! - టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసులో మ‌రో 19 మంది అరెస్ట్‌

హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేయించి ప‌ట్టుబ‌డిన‌ పోల రమేష్‌కి నిందితులతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.

త‌వ్వే కొద్దీ.. నిందితులు..! - టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసులో మ‌రో 19 మంది అరెస్ట్‌
X

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో త‌వ్వినకొద్దీ నిందితులు బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఈ కేసులో మరికొంత‌మంది నిందితుల‌ను సిట్ అధికారులు సోమ‌వారం అరెస్టు చేశారు. దీంతో ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టివ‌ర‌కు అరెస్టు అయిన‌వారి సంఖ్య 74కు చేరింది. ఈ కేసులో ప్ర‌స్తుతం అరెస్ట‌యిన 19 మంది నిందితులు.. ఈ వ్య‌వ‌హారంలో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న‌ పోల రమేష్ నుంచి ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన వార‌ని సిట్ అధికారులు విచార‌ణ‌లో భాగంగా గుర్తించారు.

ఈ పరీక్షలో హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేయించి ప‌ట్టుబ‌డిన‌ పోల రమేష్‌కి నిందితులతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పేపర్‌ని 30 మందికి విక్రయించిన‌ట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఆ క్ర‌మంలో పోల ర‌మేష్ ఇచ్చిన స‌మాచారంతోనే తాజాగా వీరిని అరెస్టు చేశారు.

First Published:  11 July 2023 2:21 AM GMT
Next Story