Telugu Global
Sports

కారు నుజ్జునుజ్జు. చావుతప్పిన రిషభ్ పంత్!

భారత యువవికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కు చావుతప్పింది.

కారు నుజ్జునుజ్జు. చావుతప్పిన రిషభ్ పంత్!
X

భారత యువవికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కు చావుతప్పింది. ఢిల్లీలో జరిగిన ఓ ప్రమాదంలో రిషభ్ కారు నుజ్జునుజ్జయ్యింది. ప్రాణాలతో బయటపడిన రిషబ్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు....

భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మృత్యువు అంచుల వరకూ వెళ్లి బయట పడ్డాడు. ఉత్తరాఖండ్ లో తన స్నేహితులతో కలసి గత మూడురోజులుగా గడిపి కారులో ఢిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో రూర్కీ సమీపంలోని హమాద్ పూర్ జాల్ దగ్గర ప్రమాదం చోటు చేసుకొంది.

రిషభ్ పంత్ కారు రోడ్డు డివైడర్ ను ఢీ కొనడంతో...కారు నుజ్జునుజ్జయింది. రిషభ్ నుదుటి భాగంతో పాటు కాలికి తీవ్రగాయాలయ్యాయని, రిషభ్ ఆరోగ్యం నిలకడగా ఉందని చికిత్స చేస్తున్న వైద్యుడు సుశీల్ నగార్ ప్రకటించారు.

రూర్కీ నుంచి ఢిల్లీకి తరలించిన తర్వాత రిషభ్ పంత్ కు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

రిషభ్ ప్రయాణిస్తున్న కారు అత్యంత వేగంగా వచ్చి డివైడర్ ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయని, కారు నుజ్జునుజ్జుగా చితికిపోయిందని ప్రత్యక్షవర్గాలు తెలిపాయి. తీవ్రంగా గాయపడిన పంత్ ను ఢిల్లీ రోడ్డులోోని సక్షామ్ ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. రిషభ్ కు ప్రాణాపాయం తప్పినట్లేనని. ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.

బంగ్లాదేశ్ తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ లో దారుణంగా విఫలమైన రిషభ్ పంత్..టెస్టు సిరీస్ లో పర్వాలేదనిపించాడు. అయితే ..శ్రీలంకతో జనవరిలో జరిగే టీ-20, వన్డే సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్టులో రిషభ్ స్థానం కోల్పోయాడు.

First Published:  30 Dec 2022 3:50 AM GMT
Next Story