Telugu Global
Sports

వారం రోజుల్లో రియాన్ మరో ప్రపంచ రికార్డు!

భారత యువ బ్యాటర్ రియాన్ పరాగ్ వారంరోజుల్లో రెండో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ మేటి బ్యాటర్లను మించిపోయాడు...

వారం రోజుల్లో రియాన్ మరో ప్రపంచ రికార్డు!
X

భారత యువ బ్యాటర్ రియాన్ పరాగ్ వారంరోజుల్లో రెండో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ మేటి బ్యాటర్లను మించిపోయాడు...

దేశవాళీ టీ-20 ( సయ్యద్ ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నీ ) 2023 సీజన్లో రికార్డుల మోత మోగుతోంది. భారత్ కమ్ అసోం యువబ్యాటర్ రియాన్ పరాగ్ కేవలం 7 రోజుల వ్యవధిలోనే రెండు సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.

టీ-20 చరిత్రలో ఒకే ఒక్కడు....

20 ఓవర్లు..60 థ్లిల్స్ గా సాగే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ చరిత్రలో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు బాదిన మొనగాడిగా, ఒకే ఒక్కడిగా అసోం కమ్ రాజస్థాన్ రాయల్స్ మిడిలార్డర్ ఆటగాడు రియాన్ పరాగ్ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

క్వార్టర్ ఫైనల్స్ లో చోటు కోసం బెంగాల్ తో జరిగిన పోరులో అసోం తరపున బ్యాటింగ్ కు దిగిన రియాన్ అర్థశతకం బాదడం ద్వారా తన పేరుతోనే ఉన్న వరుసగా ఆరు హాఫ్ సెంచరీల ప్రపంచరికార్డును తానే అధిగమించాడు.

వరుసగా 7 హాఫ్ సెంచరీలు...

ప్రస్తుత సీజన్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నీ మొదటి 7 రౌండ్ల మ్యాచ్ ల్లోనే వరుసగా ఆరు హాఫ్ సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన రియాన్..8వ రౌండ్ మ్యాచ్ లో సైతం మెరుపు హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు.

బెంగాల్ తో జరిగిన పోరులో రియాన్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా తనజట్టుకు క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేశాడు.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతూ వస్తున్న రియాన్ పరాగ్ కు..భారతజట్టులో సభ్యుడిగా అండర్ -19 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొన్న అనుభవంసైతం ఉంది.

8 మ్యాచ్ ల్లో 440 పరుగులు..

ఇప్పటి వరకూ ఆడిన 8 మ్యాచ్ ల్లో రియాన్ వరుసగా 7 హాఫ్ సెంచరీలతో సహా 490 పరుగులతో నంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు. ప్రస్తుత సీజన్ టోర్నీ తొలిరౌండ్ మ్యాచ్ లో ఒడిషాపై 19 బంతుల్లోనే 45 పరుగులు సాధించిన రియాన్..ఆ తర్వాతి ఆరు మ్యాచ్ ల్లోనూ మరి వెనుదిరిగి చూసింది లేదు.

బీహార్ పై 34 బంతుల్లో 61 పరుగులు, సర్వీసెస్ పై 37 బంతుల్లో 76 పరుగుల నాటౌట్ స్కోరు సాధించిన రియాన్..సిక్కింపైన 29 బంతుల్లో 53 నాటౌట్, చండీగఢ్ పైన 39 బంతుల్లో 76 పరుగులు, హిమాచల్ ప్రదేశ్ పైన 37 బంతుల్లో 72 పరుగుల స్కోర్లునమోదు చేశాడు. ఇక..పవర్ ఫుల్ కేరళతో జరిగిన కీలక మ్యాచ్ లో రియాన్ 33 బంతుల్లోనే 57 పరుగుల నాటౌట్ స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. 8వ రౌండ్ పోరులో బెంగాల్ పై 31 బంతుల్లో అర్థశతకం సాధించాడు. క్వార్టర్ ఫైనల్-2 లో కేరళతో అసోం అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంది.

టీ-20 క్రికెట్ చరిత్రలోనే వరుసగా ఏడు అర్థశతకాలు బాదిన తొలి, ఏకైక క్రికెటర్ గా రియాన్ పరాగ్ రికార్డుల్లో చేరాడు.

హేమాహేమీలను మించిన రియాన్..

టీ-20 క్రికెట్ ఓ టోర్నమెంట్ లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలతో గతంలో ఏడుగురుక్రికెటర్లు నెలకొల్పిన రికార్డును రియాన్ పరాగ్ రెండుసార్లు అధిగమించాడు.

2012 ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వరుసగా 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. జింబాబ్వే బ్యాటర్ హామిల్టన్ మసకడ్జ 2012 సీజన్లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు బాదితే..పాక్ క్రికెటర్ కమ్రన్ అక్మల్ 2017లో లాహోర్ వైట్స్ తరపున 5 హాఫ్ సెంచరీలు సాధించాడు.

2018 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్, 2019 ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, 2021 సీజన్లో న్యూజిలాండ్ కు చెందిన స్టార్ హిట్టర్ డేవన్ కాన్వే , 2023 సీజన్లో డెర్బీషైర్ ఆటగాడు వెయిన్ మాడ్సెన్ వరుసగా ఐదేసి హాఫ్ సెంచరీలతో దక్కించుకొన్న ఘనతను రియాన్ పరాగ్ ఆరు వరుస హాఫ్ సెంచరీలతో తెరమరుగు చేశాడు. అంతేకాదు వరుసగా 7వ హాఫ్ సెంచరీతో తనకుతానే సాటిగా నిలిచాడు.

First Published:  1 Nov 2023 2:42 AM GMT
Next Story