Telugu Global
Science and Technology

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ దీపావళి సేల్స్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై క్రేజీ ఆఫర్లు!

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ దివాళీ సేల్’ నడుస్తోంది. ఈ సేల్ ఈ నెల 11వ తేదీ వరకూ లైవ్‌లో ఉంటుంది. అలాగే ప్రస్తుతం అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనల్ డేస్ సేల్’ నడుస్తోంది.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ దీపావళి సేల్స్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై క్రేజీ ఆఫర్లు!
X

మరో వారంలో దీపావళి పండుగ రాబోతోంది. ఈ ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఇ–కామర్స్ సంస్థలు డిస్కౌంట్ సేల్స్‌ను ప్రకటించాయి. పండుగ సమయంలో కొత్త ఫోన్ కొనాలనుకునేవాళ్లు ఈ డీల్స్‌పై ఓ లుక్కేయాల్సిందే..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ దివాళీ సేల్’ నడుస్తోంది. ఈ సేల్ ఈ నెల 11వ తేదీ వరకూ లైవ్‌లో ఉంటుంది. అలాగే ప్రస్తుతం అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనల్ డేస్ సేల్’ నడుస్తోంది. ఇందులో ఐఫోన్‌తో పాటు పలు మొబైళ్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్డ్ డీల్స్

ఫ్లిప్‌కార్ట్ దీపావ‌ళి సేల్‌లో భాగంగా ఐ-ఫోన్ 14ను రూ.54,999ల‌కే సొంతం చేసుకోవచ్చు. కాగా దీని అసలు ధర రూ.61,999 ఉంది. దీనికితోడు ఎస్‌బీఐ, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అదనంగా రూ.4000 డిస్కౌంట్‌ ఉంది.

ఫ్లిప్ కార్ట్ దీపావళి సేల్ లో ఐఫోన్ 14 ప్లస్.. రూ. 63,999కి లభిస్తుంది. దీని అసలు ధర రూ. 79,900. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తే.. రూ. 59,999కే లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్‌లో మిడ్‌రేంజ్ ఫోన్ల ధరలు కూడా తగ్గాయి. రూ. 41,999 ధర ఉన్న నథింగ్ ఫోన్ 2.. సేల్‌లో రూ. 33,999కే లభిస్తోంది. అలాగే గూగుల్ పిక్సెల్ 7ఏ ధర రూ. 31,499కి తగ్గింది. మోటొరోలా ఎడ్జ్ 40 మొబైల్ రూ.25,999కే అందుబాటులో ఉంది. వివో టీ2 ప్రో మొబైల్ రూ. 21,999కే లభిస్తోంది.

ఇక బడ్జెట్ మొబైల్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 మొబైల్ రూ. 9,990కి లభిస్తోంది. దీని అసలు ధర రూ.17,490. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 ఫోన్‌ రూ.14,999కి అందుబాటులో ఉంది. పోకో ఎక్స్5 ప్రో మొబైల్ ధర రూ.18,499కి తగ్గింది.

అమెజాన్ ఆఫర్లు

అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 13 ధర రూ.69,900 నుంచి రూ.55,990కి తగ్గింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ ధర రూ. 28,998 నుంచి రూ.24,499కి తగ్గింది.

శాంసంగ్ గెలాక్సీ ఎం 34 ఫోన్.. అసలు ధర రూ. 24,999 కాగా సేల్‌లో రూ.14,999కే అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం 14 ధర రూ.17,990 నుంచి రూ.10,490కి తగ్గింది. రియ‌ల్‌మీ నార్జో ఐ ప్రైమ్ ఫోన్ ధర రూ.9,999 నుంచి రూ.6,569కి తగ్గింది.

వీటితోపాటు రెడ్‌మీ నోట్ 12 ఫోన్ రూ.10,499( అసలు ధర రూ.18,999), వ‌న్‌ప్లస్ 11 ఆర్ 5జీ రూ. 37,999(అసలు ధర రూ. 39,999 ), టెక్నో పోవా5ప్రో 5జీ రూ.12,299(అసలు ధర రూ.19,999)కు అందుబాటులో ఉన్నాయి.

First Published:  7 Nov 2023 11:29 AM GMT
Next Story