మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం
ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుతో చిరంజీవిని సత్కరించనుంది భారత ప్రభుత్వం.
సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలకుగాను ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ - 2022 అవార్డు వరించింది.
ఆదివారం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది.
పురస్కార గ్రహీతకు నెమలి బొమ్మ కలిగిన రజత పతకం, రూ.10 లక్షలు, ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.
తెలుగు సినీ నటుడిగా చిరంజీవి 150కు పైగా సినిమాల్లో నటించారు. నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు.
ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటిస్తున్నారు.