Telugu Global
NEWS

సంక్రాంతికి నిలిచే హీరో ఎవరు..? సైడయ్యే హీరో ఎవరు..?

అందుకే ఈ రెండు సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్ లు ప్రకటించలేదు. జస్ట్ సంక్రాంతికి విడుదల అని మాత్రమే అనౌన్స్ చేశారు. ఒక్క విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు మాత్రమే సంక్రాంతికి రావడం పక్కా అయింది.

సంక్రాంతికి నిలిచే హీరో ఎవరు..? సైడయ్యే హీరో ఎవరు..?
X

సినిమాలకు అతి పెద్ద సీజన్ సంక్రాంతి. అతి పెద్ద పండుగ కావడంతో ఎక్కడెక్కడో పొరుగూర్లలో ఉద్యోగాలు చేసుకునే వారు కూడా పండక్కి ఇంటికి వస్తుంటారు. అందరూ కలిసి సరదాగా సినిమాలకు వెళ్తుంటారు. అందుకే సంక్రాంతికి పోటీ ఉన్నప్పటికీ మూడు నాలుగు సినిమాలు విడుదల అవుతుంటాయి. అంత పోటీ ఉన్నప్పటికీ కలెక్షన్లు బాగానే ఉంటాయి. అయితే సంక్రాంతికి విడుదల చేసి సినిమాల్లో ఒకటి రెండు సినిమాలు పెద్ద హీరోలవి, మిగతావి చిన్న హీరోలు నటించేవిగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది.

అయితే ఈ సారి మాత్రం సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలవుతుండగా.. ఆ సినిమాలు అన్ని భారీ క్రేజ్ ఉన్న హీరోలవి కావడం గమనార్హం. ఈ సారి పొంగల్ కానుకగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో జనవరి 12వ తేదీన భారీగా విడుదల కానుంది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ ఇవాళ ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఇక తమిళ అగ్ర హీరో విజయ్ చేస్తున్న ద్విభాషా చిత్రం వారసుడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీనిని ఇవాళ కన్ఫర్మ్ చేశారు, కానీ విడుదల చేసే డేట్ ను మాత్రం చెప్పలేదు.

చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఒక పాన్ ఇండియా సినిమాతో పాటు మరో ముగ్గురు అగ్ర హీరోలు నటించిన సినిమాలు సంక్రాంతికి విడుదల అయితే నాలుగు సినిమాలకు చాలినన్ని థియేటర్లు దొరకడం కష్టం. దీంతో ఈ నాలుగు సినిమాల్లో ఒక సినిమా సంక్రాంతి పండగ నుంచి సైడ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఆదిపురుష్ సినిమా టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. పూర్తిగా యానిమేటెడ్ మూవీ లాగా ఉందని, హీరో హీరోయిన్లు ఇతర నటులు బొమ్మల్లాగా కనిపిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. VFX మిక్సింగ్ కూడా బాగాలేదని టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ మేకర్స్ రంగంలోకి దిగి ఆదిపురుష్ లో కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ లుక్ మార్చడంతో పాటు, మళ్లీ VFX చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కనుక ఆలస్యమైతే ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

అలాగే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలను ఒకే సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ రెండు సినిమాలు పండక్కి పోటీపడితే నష్టపోయేది మైత్రీ వాళ్లే. ఒక సినిమాకు హిట్ టాక్ వచ్చి మరో సినిమాకు ప్లాప్ టాక్ వస్తే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి మాత్రమే విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.

అందుకే ఈ రెండు సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్ లు ప్రకటించలేదు. జస్ట్ సంక్రాంతికి విడుదల అని మాత్రమే అనౌన్స్ చేశారు. ఒక్క విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు మాత్రమే సంక్రాంతికి రావడం పక్కా అయింది. ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో ఏది సైడ్ అయ్యేది తెలిస్తే మిగతా సినిమాల రిలీజ్ డేట్ లు ప్రకటించే అవకాశం ఉంది.

First Published:  25 Oct 2022 2:21 AM GMT
Next Story