Telugu Global
NEWS

చైతూతో విడిపోవడం సామరస్యంగా జరగలేదు.. సమంత షాకింగ్ కామెంట్స్..!

కరణ్ జోహార్ సమంత వ్యక్తిగత జీవితంపై పలు ప్రశ్నలను అడిగాడు. ముఖ్యంగా విడాకులపై పలు ప్రశ్నలకు సమంత సమాధానాలు ఇచ్చింది. నాగచైతన్యతో తాను విడిపోవడం సామరస్యంగా జరగలేదని సమంత ఆ షోలో పేర్కొంది.

చైతూతో విడిపోవడం సామరస్యంగా జరగలేదు.. సమంత షాకింగ్ కామెంట్స్..!
X

హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారు మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకొని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ దీని గురించి చర్చ జరుగుతూనే ఉంది. సమంతతో విడిపోయిన తర్వాత చైతన్య ఎక్కడా విడాకుల గురించి స్పందించడం లేదు. సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేస్తున్నాడు. అయితే సమంత మాత్రం వీలుచిక్కినప్పుడల్లా చైతూతో విడాకులకు సంబంధించి స్పందిస్తూ వస్తోంది.

బాలీవుడ్ లో దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా నిర్వహించే కాఫీ విత్ కరణ్ షో ఎంతో ఫేమస్ అనే విషయం తెలిసిందే. ఈ షోకు ఎక్కువగా సెలబ్రిటీలు వస్తుంటారు. ఇందులో ఎక్కువగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రశ్నలే ఉంటాయి. ఈ షోలో సమంత పాల్గొన్న ప్రోమోస్ కొద్ది రోజులుగా విడుదల చేస్తూ వచ్చారు. ఈ షోలో నాగచైతన్య గురించి సమంత షాకింగ్ కామెంట్స్ చేసిందని ప్రోమోలను బట్టే అర్థమైంది. గురువారం రాత్రి ఈ షోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైంది. ఈ షోలో సమంతతో పాటు ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కరణ్ జోహార్ సమంత వ్యక్తిగత జీవితంపై పలు ప్రశ్నలను అడిగాడు. ముఖ్యంగా విడాకులపై పలు ప్రశ్నలకు సమంత సమాధానాలు ఇచ్చింది. నాగచైతన్యతో తాను విడిపోవడం సామరస్యంగా జరగలేదని సమంత ఆ షోలో పేర్కొంది. చైతన్యతో విడిపోయిన తర్వాత జీవితం చాలా కష్టంగా అనిపించిందని, కానీ ఇప్పుడు బాగుందని, గతంతో పోలిస్తే బలంగా ఉన్నానని చెప్పింది. చైతన్యతో విడిపోయిన తర్వాత తన పైనే ఎక్కువగా ట్రోలింగ్ జరిగిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. అయితే దీనిపై తాను ఫిర్యాదు చేయదలుచుకోలేదని, సాధ్యమైనంతవరకు అభిమానులకు సమాధానాలు ఇచ్చానని చెప్పారు. ప్రశాంతంగా ఉండేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పేర్కొంది.

'నువ్వు నీ భర్త విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత.. అని కరణ్ ప్రశ్నిస్తుండగా .. సమంత మధ్యలో కలగజేసుకుని మాజీ భర్త అని పిలవాలని సూచించింది. ప్రస్తుతం సమంత, చైతన్య స్నేహపూర్వకంగానే ఉన్నారా? అని కరణ్ జోహార్ ప్రశ్నించగా సమంత షాకింగ్ రిప్లై ఇచ్చింది.

'ఒకవేళ మీరు ప్రస్తుతం మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే, మీరు ఆ గదిలో పదునైన వస్తువులను అందుబాటులో లేకుండా చూడాలి. ఇప్పటికీ ఇప్పుడైతే ఇదే నా అభిప్రాయం. అయితే భవిష్యత్తులో మేమిద్దరం మళ్లీ స్నేహపూర్వకంగా మారొచ్చు. ' అని సమంత కామెంట్ చేసింది. సమంత చేసిన కామెంట్స్ ని బట్టి చైతూపై ఆమెకు అంత కోపం ఉందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ షోలో సమంత చైతూ గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

First Published:  22 July 2022 3:00 AM GMT
Next Story