Telugu Global
National

కేంద్ర మంత్రి ఇంట్లో యువ‌కుడి హ‌త్య? - మంత్రి కొడుకుపైనే అనుమానాలు

వినయ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారీ స్థాయిలో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ముగ్గురు వ్యక్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

కేంద్ర మంత్రి ఇంట్లో యువ‌కుడి హ‌త్య?  - మంత్రి కొడుకుపైనే అనుమానాలు
X

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌ధాని ల‌క్నోలోని కేంద్ర మంత్రి ఇంట్లో యువ‌కుడు హ‌త్య‌కు గురైన‌ట్టు తెలుస్తోంది. కేంద్ర‌మంత్రి కొడుకే ఆ యువ‌కుడిని కాల్చి చంపాడ‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై వివ‌రాలను జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగిన‌ ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి.

కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో నివ‌సిస్తున్నారు. ఆయ‌న నివాసంలో విన‌య్ శ్రీ‌వాస్త‌వ అనే యువ‌కుడి మృత‌దేహం ల‌భ్యం కావ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఘ‌ట‌నాస్థ‌లంలో ఒక తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నార‌ని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

వినయ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారీస్థాయిలో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ముగ్గురు వ్యక్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రి కుమారుడు స‌ద‌రు యువ‌కుడిని కాల్చి చంపి ఉంటాడ‌ని స‌మాచారం. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

First Published:  1 Sep 2023 6:45 AM GMT
Next Story