Telugu Global
National

ప్రేమ తిరస్కరించిందని యువతి దారుణ హత్య

హుబ్లీ పోలీసులు నిందితుడిపై ఐసీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

ప్రేమ తిరస్కరించిందని యువతి దారుణ హత్య
X

తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఓ యువకుడు ప్రేమించిన యువ‌తిని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో జరిగింది. నగరంలోని బెండిగేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరాపూర్ ఓని ప్రాంతంలో అంజలి అంబిగేరా అనే యువతి నివసిస్తోంది. తనను ప్రేమించాలంటూ ఆమెను విశ్వ అలియాస్ గిరీష్ సావంత్ కొద్ది రోజులుగా వెంటపడుతున్నాడు. అయితే ఇటీవల విశ్వ మరోసారి ప్రేమ ప్రతిపాదనను తీసుకురాగా అంజలి తిరస్కరించింది.

అంజలిపై కక్ష పెంచుకున్న విశ్వ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం ఉదయం అంజలి ఇంటికి వెళ్ళాడు. తలుపుత‌ట్ట‌గానే అంజలి వచ్చి తలుపు తీసింది. ఆమె తలుపు తీసిన వెంటనే విశ్వ ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

హుబ్లీ పోలీసులు నిందితుడిపై ఐసీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

ప్రేమ తిరస్కరించిందన్న కోపంతో యువతిని హత్య చేయడం గత కొద్ది రోజుల్లో హుబ్లీలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. అంతకు ముందు హుబ్లీలో ఓ యువకుడు తన ప్రేమను తిరస్కరించినందుకు కాంగ్రెస్ కౌన్సిలర్ కుమార్తెను బహిరంగంగా కత్తితో పొడిచి చంపాడు. వరుసగా ఇటువంటి ఘటనలు రెండు జరగడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.

First Published:  15 May 2024 1:19 PM GMT
Next Story