Telugu Global
National

భ‌ర్త‌ను చంపి.. 5 ముక్క‌లుగా నరికి..

రాంపాల్ (55) భార్య దులారో దేవికి వేరే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు ఆమె నిర్ణయించుకుంది.

భ‌ర్త‌ను చంపి.. 5 ముక్క‌లుగా నరికి..
X

మ‌నుషుల్లో నేర స్వ‌భావం పెచ్చుమీరుతోందా.. అది ఆందోళ‌న‌కు గురిచేసే స్థాయికి చేరుతోందా..? అంటే ఇటీవ‌ల వరుస‌గా వెలుగుచూస్తున్న ఉదంతాలు నిజ‌మేన‌నిపించేలా ఉన్నాయి. ఎదుటి వ్య‌క్తుల‌పై కోపం క‌లిగిన‌ప్పుడు దాడి చేయ‌డానికే వెనుకా ముందూ ఆలోచించాల్సిన ప‌రిస్థితుల నుంచి.. ఒక వ్య‌క్తిని చంపేందుకు కూడా తెగ‌బ‌డుతుండ‌టం.. ఆ నేరం నుంచి త‌ప్పించుకునేందుకు అత్యంత పాశ‌వికంగా, సాధార‌ణంగా హాలీవుడ్‌లోని దెయ్యాల సినిమాల్లో మాత్ర‌మే చూపించేలా శ‌రీరాన్ని ముక్క‌లుగా న‌రికేసేంత‌గా మ‌నుషుల్లో నేర స్వ‌భావం పెరిగిపోతోందా అనే ఆందోళ‌న క‌లుగుతోంది. ఓ వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న ఓ మ‌హిళ.. దానిని కొన‌సాగించేందుకు అడ్డుగా ఉన్న‌ భ‌ర్త‌ను వ‌దిలించుకునేందుకు ఏకంగా అత‌న్ని చంపేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం, అదీ గొడ్డ‌లితో న‌రికి చంపి, శ‌రీరాన్ని ముక్క‌లు చేసి మ‌రీ మాయం చేయాల‌ని చూడ‌టం ఇలాంటి ఉదాహ‌ర‌ణే.

ఉత్తరప్రదేశ్‌లోని పీలీభీత్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను అడ్డుతొలగించుకొనేందుకు అత‌న్ని గొడ్డలితో నరికి చంపింది. అనంతరం మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికి గోనె సంచిలో మూటకట్టి కాలువలోకి విసిరేసింది. తన తండ్రి కనిపించకపోవడంపై మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రాంపాల్ (55) భార్య దులారో దేవికి వేరే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు ఆమె నిర్ణయించుకుంది. సోమవారం అర్ధరాత్రి రాంపాల్ నిద్రిస్తుండగా అత‌న్ని గొడ్డలితో నరికి చంపింది. మంగళవారం నుంచి తన తండ్రి కనిపించకపోవడంతో మృతుడి కుమారుడు సోంపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు దులారో దేవిపై అనుమానం క‌ల‌గ‌డంతో ఆమెను అదుపులోకి తీసుకుని త‌మ‌దైన శైలిలో విచార‌ణ చేశారు. ఈ క్ర‌మంలో ఆమె చేసిన నేరాన్ని అంగీకరించింది. రాంపాల్ మృతదేహాన్ని కాలువలో నుంచి గురువారం వెలికితీసినట్టు పోలీసులు వెల్ల‌డించారు.

First Published:  29 July 2023 3:39 AM GMT
Next Story