Telugu Global
National

నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఉన్మాది..

ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో ఈ షాకింగ్‌ సంఘటన జరిగింది. ఒకే వ్యక్తి కుటుంబంలోని ఐదుగురుని చంపి ఆ తరవాత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఉన్మాది..
X

చెడు అలవాట్లకు బానిసైన ఒక వ్యక్తి స్వంత కుంటుంబంలోని ప్రతి వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. మాదక ద్రవ్యాలు, మద్యానికి బానిసైన వ్యక్తి ఉన్మాదిలా మారాడు. విధ్వంసం సృష్టించాడు. కన్నా తల్లిని కాల్చి చంపాడు. కట్టుకున్న భార్యను సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. కన్నా బిడ్డలు ముగ్గురిని ఏకంగా మేడ పైనుంచి కిందకు విసిరేసి చంపాడు. ఆ తర్వాత గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో ఈ షాకింగ్‌ సంఘటన జరిగింది. ఒకే వ్యక్తి కుటుంబంలోని ఐదుగురుని చంపి ఆ తరవాత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పల్హాపూర్ గ్రామానికి చెందిన 42 ఏళ్ల అనురాగ్ సింగ్ మానసిక వికలాంగుడు. దీంతోపాటు మాదకద్రవ్యాలు, మద్యానికి బానిస అయ్యాడు. అనవసరకారణాలతో తరచుగా కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. శనివారం కూడా మద్యం సేవించిన అనురాగ్ సింగ్ మళ్లీ కుటుంబంతో గొడవ పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యలు అతనిని అడిక్షన్ సెంటర్ కు వెళ్ళాల్సిందిగా సూచించారు.

దీంతో ఆవేశంతో ఊగిపోయిన అనురాగ్ సింగ్ ఉన్మాదిలా మారిపోయాడు. అప్పటికప్పుడే ఇంట్లో విధ్వంసం సృష్టించాడు. ముందు గదిలో ఉన్న 65 ఏళ్ల తల్లి సావిత్రిని గన్‌తో కాల్చి చంపాడు. తర్వాత 40 ఏళ్ల భార్య ప్రియాంక తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం ముగ్గురు పిల్లలైన 12 ఏళ్ల అశ్విని, 9 ఏళ్ల ఆర్నా, 6 ఏళ్ల అద్విక్‌ను మేడ పైనుంచి కిందకు విసిరేశాడు. ఆ తర్వాత అనురాగ్ సింగ్‌ గన్‌తో కాల్చుకోవడంతో అతడు కూడా మరణించాడు.

ఈ వరుస ఘటనలతో కుటుంబంలోని అందరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేపింది. జనం పెద్ద ఎత్తున ఆ ఇంటి వద్ద గుమిగూడారు. సమాచారం ఆదుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆధారాల సేకరణకు ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తుకు ఆదేశించారు.

First Published:  11 May 2024 10:04 AM GMT
Next Story