Telugu Global
National

పెళ్ళైన గంటకే విడాకులు

ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయ్ ఖుర్ద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఓ యువతితో పెళ్ళైంది. పెళ్ళి పూర్తవగానే ఆ వ్యక్తి మొదటి భార్య రంగప్రవేశం చేసింది. తాను ఉండగా మరో పెళ్ళి ఎలా చేసుకుంటావంటూ ఆమె గొడవకు దిగింది.

పెళ్ళైన గంటకే విడాకులు
X

పెళ్ళైన గంటకే విడాకులయ్యాయి. యువతికి మరో యువకుడితో మళ్ళీ పెళ్ళైంది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయ్ ఖుర్ద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఓ యువతితో పెళ్ళైంది. పెళ్ళి పూర్తవగానే ఆ వ్యక్తి మొదటి భార్య రంగప్రవేశం చేసింది. తాను ఉండగా మరో పెళ్ళి ఎలా చేసుకుంటావంటూ ఆమె గొడవకు దిగింది.

నిజానికి అతనికి అప్పటికే పెళ్ళయి నాలుగేళ్ళయ్యింది. భార్యా భర్తల మధ్య గొడవలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్ళింది. దాంతో ఆ వ్యక్తి మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఆ యువతితోనే పెళ్ళికి సిద్దమయిపోయాడు. ఈ విషయం తెలిసిన అమ్మాయి బంధువులకు ఏం చెయ్యాలో తోచలేదు. చివరకు సమస్య పోలీసు స్టేషన్ కు చేరింది. పోలీసులు గ్రామ‍పంచాయితీ పెద్దలు చర్చలు జరిపి చివరకు ఆ వ్యక్తి కొత్తగా పెళ్ళి చేసుకున్న యువతికి విడాకులు ఇవ్వాలని, అతని తమ్ముడితో ఆ యువతికి పెళి జరిపించాలని నిర్ణయించారు. పెద్దల నిర్ణయానికి ఆ వ్యక్తి కూడా తలూపడంతో పెళ్ళి మండపంలోనే ఆ యువతికి అతను విడాకులు ఇచ్చాడు. ఆ వెంటనే అతని సోదరుడితో వివాహం జరిగిపోయింది.

అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని అస్మోలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌ అస్మోలి సంజయ్‌కుమార్‌ తెలిపారు. ఎవరూ ఎలాంటి పిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు.

ఈ సంఘటనపై సోషల్ మీడియాలో నెటిజనులు విభిన్నంగా స్పందిస్తున్నారు. కథ సుఖాంతం అయినందుకు కొందరు ఆనందం వ్యక్తం చేయగా, మొదటి భార్య ఉండగా చట్ట విరుద్దంగా మరో పెళ్ళి చేసుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పట్ల పలువురు విమర్శలు సంధించారు.

First Published:  6 Jan 2023 3:28 AM GMT
Next Story