Telugu Global
National

బాలుడిపై లైంగిక వేధింపులు.. యువకుడిని చంపి నిప్పు పెట్టిన మైన‌ర్లు

డిసెంబర్ 21వ తేదీ రాత్రి బాలుడు మరో ఇద్దరు మైనర్‌ల‌తో కలిసి హజరత్ నిజాముద్దీన్ లోని ఖుస్రో పార్కు వద్దకు యువకుడిని రప్పించారు.

బాలుడిపై లైంగిక వేధింపులు.. యువకుడిని చంపి నిప్పు పెట్టిన మైన‌ర్లు
X

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన జరిగింది. తనను లైంగికంగా వేధించిన యువకుడిని ఓ బాలుడు స్నేహితులతో కలిసి హత్య చేశాడు. ఆ తర్వాత యువకుడి మృతదేహానికి నిప్పు పెట్టారు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. ఆగ్నేయ ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడు పదహారేళ్ల యువకుడిని లైంగికంగా వేధించాడు. దీంతో బాధిత బాలుడు యువకుడిని హత్య చేసేందుకు పథకం రచించాడు. డిసెంబర్ 21వ తేదీ రాత్రి బాలుడు మరో ఇద్దరు మైనర్‌ల‌తో కలిసి హజరత్ నిజాముద్దీన్ లోని ఖుస్రో పార్కు వద్దకు యువకుడిని రప్పించారు.

అతడు వచ్చిన తర్వాత కత్తితో పొడిచి.. కర్రలతో దాడి చేసి.. రాళ్లు విసిరి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత యువకుడి మృతదేహాన్ని పార్క్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎండు గడ్డి, దుస్తులు వేసి నిప్పు పెట్టారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

శనివారం రాత్రి సగం కాలి ఉన్న మృతదేహం పార్క్ సమీపంలో పడి ఉండగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. నిజాముద్దీన్ బస్తీకి చెందిన ముగ్గురు బాలురు ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఆ ముగ్గురు బాలురను ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

యువకుడిని తామే హత్య చేసినట్లు వారు అంగీకరించారని చెప్పారు. నిందితులు ముగ్గురు 16, 17 ఏళ్ళున్న మైనర్లని తెలిపారు. ఆ ముగ్గురిలో ఒకరిని యువకుడు లైంగికంగా వేధించడంతోనే ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తి, కర్రలు, రాళ్ళను స్వాధీనం చేసుకొని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎయిమ్స్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

First Published:  25 Dec 2023 9:40 AM GMT
Next Story