Telugu Global
National

జ‌డ్జీల నియామ‌కాల విష‌యంలో కేంద్రం జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

పదోన్నతుల కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 10 మంది న్యాయమూర్తుల పేర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. నవంబర్ 25న ప్ర‌భుత్వం నుంచి తిరిగి వచ్చిన ఫైళ్లలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి బిఎన్ కిర్పాల్ కుమారుడు, సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ పేరు కూడా ఉంది.

జ‌డ్జీల నియామ‌కాల విష‌యంలో కేంద్రం జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం
X

న్యాయమూర్తుల నియామకాల జాబితాను క్లియర్ చేయకుండా కేంద్రం జాప్యం చేయ‌డంపై సుప్రీంకోర్టు తన ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

"కొలీజియం ఒక్కసారి పేరును ఉద్ఘాటిస్తే అది అక్క‌డితో ముగిసిన అధ్యాయం.. పేర్లను ఇలా పెండింగ్‌లో ఉంచడం ద్వారా అది (ప్రభుత్వం) పరిధిని దాటుతోంది'' అని కోర్టు పేర్కొంది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా దీనిని పరిష్కరించండి. ఈ విషయంలో మమ్మల్ని న్యాయపరమైన నిర్ణయం తీసుకునేలా చేయ‌వద్దు" అని న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, ఎఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం హెచ్చ‌రించింది.

"మీరు పేర్లను నిలిపివేయడం సాధ్యం కాదు, ఇది మొత్తం వ్యవస్థను నిరాశపరుస్తుంది. కొన్నిసార్లు మీరు నియమించాల‌నుకున్నప్పుడు, జాబితా నుండి కొన్ని పేర్లను మాత్రమే ఎంచుకుంటారు, ఇతరుల పేర్ల‌ను పక్కన పెట్టేస్తారు. మీరు చేసేది సీనియారిటీని దెబ్బతీయడమే అవుతుంది" అని కోర్టు పేర్కొంది.

పదోన్నతుల కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 10 మంది న్యాయమూర్తుల పేర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. నవంబర్ 25న ప్ర‌భుత్వం నుంచి తిరిగి వచ్చిన ఫైళ్లలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి బిఎన్ కిర్పాల్ కుమారుడు, సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ పేరు కూడా ఉంది. కొలీజియం ఉద్ఘాటించిన మ‌రి కొన్ని పేర్లను కూడా వెనక్కి పంపినట్లు అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం కోర్టు నియామకాలపై నిర్దేశించిన కాలపరిమితిని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిష‌న్ ను ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ విచారణ జ‌రుపుతోంది. 2014లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే దీనిని 2015లో సుప్రీంకోర్టు కొట్టివేయడం వల్ల కొలీజియం వ్యవస్థ తిరిగి అమల్లోకి వచ్చింది

First Published:  29 Nov 2022 2:32 AM GMT
Next Story