Telugu Global
National

దేశ రాజధానిలో నేడే బీఆరెస్ కార్యాలయం ప్రారంభం...12.30 గంటల‌కు జెండా ఆవిష్కరించనున్న కేసీఆర్

ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 12.37 నుంచి 12.47 గంటల మధ్య భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయ కార్యాలయాన్ని బీఆరెస్ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, తన కుర్చీలో అధిష్టించనున్నారు.

దేశ రాజధానిలో నేడే బీఆరెస్ కార్యాలయం ప్రారంభం...12.30 గంటల‌కు జెండా ఆవిష్కరించనున్న కేసీఆర్
X

ఈ రోజు దేశంలో కొత్త చరిత్రకు పునాది పడనుంది. దేశాభివృద్దే లక్ష్యంగా, ప్రత్యామ్నాయ రాజకీయాలతో దేశ రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసిన 'భారత‌ రాష్ట్ర సమితి' కార్యాలయం దేశ‌ రాజధాని ఢిల్లీలో ఈ రోజు ప్రారం భంకానుంది.

ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 12.37 నుంచి 12.47 గంటల మధ్య భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయ కార్యాలయాన్ని బీఆరెస్ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, తన కుర్చీలో అధిష్టించనున్నారు.

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్‌) నేత హెచ్‌డీ కుమారస్వామి, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు ప్రారంభోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు.

BRS నాయకత్వం ఇప్పటికే గెస్ట్ లందరికీ ఆహ్వానాలు పంపింది. ఈ కార్యక్రమానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు నుండి రైతు నాయకులు కూడా హాజరుకానున్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. పురోహితులు మంగళవారం ఉదయం 11 గంటలకు BRS పార్టీ కార్యాలయంలో రెండు రోజుల రాజశ్యామల యాగం చేయడం ప్రారంభించారు. అది ఇంకా కొనసాగుతోంది.

శృంగేరి పీఠానికి చెందిన గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ నేతృత్వంలో మొత్తం 12 మంది ఋత్విక్కులు తొలిరోజు పుణ్యాహ్వాచనం, చండీ పారాయణం, మూలమంత్ర జపం తదితర క్రతువులతో యాగం నిర్వహించారు.

బుధవారం యాగం పూర్తయిన సందర్భంగా నవ చండీ హోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

దేశం, ప్రజల శ్రేయస్సు కోసం, BRS విజయం కోసం ముఖ్యమంత్రి ఈ యాగం నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ కార్యాలయంలో తాత్కాలిక యాగశాలను ఏర్పాటు చేశారు. పూర్ణాహుతి నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 12.37 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించి, 12.47లోపు తన కార్యాలయ ఛాంబర్‌లో చేరుకుని పార్టీ పత్రాలపై కేసీఆర్ సంతకాలు చేస్తారు.

బుధవారం పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నేతలు మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు.

ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు పార్టీ నేతలు పెద్దఎత్తున ఢిల్లీకి చేరుకోవడంతో బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

ప్రధాన రహదారులు, బీఆర్‌ఎస్ కార్యాలయం పరిసర ప్రాంతాలు... జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే సీఆర్ కు స్వాగతం పలుకుతూ హోర్డింగ్‌లు, బ్యానర్‌లతో గులాబీ రంగులోకి మారాయి.

First Published:  14 Dec 2022 2:49 AM GMT
Next Story