Telugu Global
National

కోలీవుడ్ స్టార్ హీరోల‌కు త‌మిళ‌నాడు చిత్ర నిర్మాత‌ల మండ‌లి ఝ‌ల‌క్‌

నిర్మాత‌ల మండ‌లి పంపించే నోటీసుల‌కు సంబంధిత హీరోలు ఇచ్చే వివ‌ర‌ణ ఆమోద‌యోగ్యంగా లేక‌పోతే వారిపై రెడ్ కార్డ్ జారీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

కోలీవుడ్ స్టార్ హీరోల‌కు త‌మిళ‌నాడు చిత్ర నిర్మాత‌ల మండ‌లి ఝ‌ల‌క్‌
X

సినిమా చేయ‌డానికి అంగీక‌రించి.. షూటింగ్‌కి స‌హ‌క‌రించ‌కుండా నిర్మాత‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్న కోలీవుడ్ స్టార్ హీరోలకు త‌మిళ‌నాడు చిత్ర నిర్మాత‌ల మండ‌లి ఝ‌ల‌క్ ఇచ్చింది. నిర్మాత‌ల‌కు స‌హ‌క‌రించ‌ని ఐదుగురు న‌టుల‌ను గుర్తించి వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే అంశంపై చ‌ర్చించింది. ఎన్‌.రామ‌సామి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో దీనిపై చ‌ర్చించిన మండ‌లి.. కొన్ని ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఆ న‌టుల‌కు త్వ‌ర‌లో నోటీసులు..!

నిర్మాత‌ల మండ‌లిలో గుర్తించిన ఐదుగురు న‌టుల‌కు త్వ‌ర‌లోనే నోటీసులు పంపించ‌నున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. వారి నుంచి వచ్చే సమాధానాన్ని ఆధారంగా చేసుకుని తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. అలాగే ఆయా నటులతో సినిమాలు చేయాలనుకుంటే ముందుగా తమ దృష్టికి తీసుకురావాలని నిర్మాతలకు మండ‌లి తెలిపింది.

రెడ్ కార్డ్ జారీ చేసే అవ‌కాశం..!

నిర్మాత‌ల మండ‌లి పంపించే నోటీసుల‌కు సంబంధిత హీరోలు ఇచ్చే వివ‌ర‌ణ ఆమోద‌యోగ్యంగా లేక‌పోతే వారిపై రెడ్ కార్డ్ జారీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ఇంత‌కీ ఆ ఐదుగురు న‌టులు ఎవ‌ర‌నేది మాత్రం నిర్మాత‌ల మండ‌లి వెల్ల‌డించ‌లేదు. అయితే కోలీవుడ్‌లో ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల ప్ర‌కారం వారు విశాల్‌, శింబు, అధ‌ర్వ‌, యోగిబాబు, ఎస్‌జే సూర్య అయ్యుండొచ్చ‌ని తెలుస్తోంది.

First Published:  19 Jun 2023 9:30 AM GMT
Next Story