Telugu Global
National

ఈ దశలో స్టే ఇవ్వలేం.. - ఈసీల నియామకంపై సుప్రీంకోర్టు

నూతన చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. ఇటీవల ఈసీలుగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్‌ అధికారులు జ్ఞానేశ్‌ కుమార్, సుఖ్‌బీర్‌ సింగ్‌ల నియామకాలను కూడా ప్రస్తావించింది.

ఈ దశలో స్టే ఇవ్వలేం.. - ఈసీల నియామకంపై సుప్రీంకోర్టు
X

ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆ చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ దశలో నిలిపివేస్తే అది తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై విచారణ అనంతరం గురువారం తీర్పు చెప్పిన ధర్మాసనం.. ఈసీల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పు అని భావించలేమని తెలిపింది.

నూతన చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. ఇటీవల ఈసీలుగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్‌ అధికారులు జ్ఞానేశ్‌ కుమార్, సుఖ్‌బీర్‌ సింగ్‌ల నియామకాలను కూడా ప్రస్తావించింది. కొత్తగా నియమితులైన వారిపై ఎలాంటి ఆరోపణలూ లేవని తెలిపింది. ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అని.. అది పాలనాయంత్రాంగం కింద పనిచేస్తుందని చెప్పకూడదని పేర్కొంది. ఈసీల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పు అని భావించలేమని తెలిపింది. ఈ సమయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం చాలా ముఖ్యమని అభిప్రాయపడింది.

గతంలో ఈ కమిటీలో ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో విపక్ష నేత సభ్యులుగా ఉండగా.. 2023లో రూపొందించిన కొత్త చట్టంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్రమంత్రికి చోటు కల్పించడం గమనార్హం. దీన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కేంద్రం బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. కొత్త చట్టంలో సీజేఐకు చోటు కల్పించకపోవడాన్ని సమర్థించుకుంది. కమిటీలో న్యాయ సభ్యుడు ఉంటేనే ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్న వాదన సరికాదని తెలిపింది.

First Published:  21 March 2024 9:55 AM GMT
Next Story