Telugu Global
National

భారత్ జోడో యాత్రను ఆపేయండి .. రాహుల్ గాంధీకి కేంద్రం లేఖ

కోవిడ్-19 కేసులు చైనాలో మ‌ళ్ళీ పెరుగుతున్నందున భారత్ అప్ర‌మ‌త్త‌మ‌వుతోంది. దీనిని అడ్డుకునేందుకు కేంద్రం సన్నాహక చర్యలు ప్రారంభించి అన్ని రాష్ట్రాల‌కు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. మాండవ్య నేడు ఉన్నతాధికారులు, నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

భారత్ జోడో యాత్రను ఆపేయండి .. రాహుల్ గాంధీకి కేంద్రం లేఖ
X

చైనా స‌హా ప‌లు దేశాల్లో మ‌ళ్ళీ కోవిడ్ కేసులు త‌లెత్తుతున్నందున అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే రాష్ట్రాల‌కు సూచించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీకి కూడా లేఖ రాసింది కేంద్రం. కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌లేక‌పోతే భారత్ జోడో యాత్రను ఆపేయండి అంటూ కేంద్రం కోరింది. ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ రాజ‌స్తాన్ లో భార‌త్ జోడో యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. కోవిడ్-19 మార్గదర్శకాలు ఖ‌చ్చితంగా పాటించేలా చూడాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాహుల్ గాంధీకి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లకు లేఖ రాశారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కోవిడ్-19 నిబంధనలను పాటించడం సాధ్యం కాకపోతే యాత్రను నిలిపివేయాలని ఆరోగ్య మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.

కోవిడ్-19 కేసులు చైనాలో మ‌ళ్ళీ పెరుగుతున్నందున భారత్ అప్ర‌మ‌త్త‌మ‌వుతోంది. దీనిని అడ్డుకునేందుకు కేంద్రం సన్నాహక చర్యలు ప్రారంభించి అన్ని రాష్ట్రాల‌కు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. మాండవ్య నేడు ఉన్నతాధికారులు, నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు

"జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనాలలో అకస్మాత్తుగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా, వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి పాజిటివ్ కేసు నమూనాల మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్‌ను సిద్ధం చేయడం చాలా అవసరం" అని ఆరోగ్య కార్యదర్శి, రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశంలో కేసులు ఉన్న‌ట్లయితే, ఈ జాగ్రత్తలు తీసుకోవ‌డం ద్వారా కొత్త వేరియంట్ల‌ను సకాలంలో గుర్తించడానికి వీల‌వుతుంద‌ని, దానిని అడ్డుకోవ‌డానికి అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టేందుకు వీలు కల్పిస్తుందని భూషణ్ పేర్కొన్నారు.

First Published:  21 Dec 2022 6:05 AM GMT
Next Story