Telugu Global
National

2024లో పోటీపై ఇంకా నో క్లారిటీ.. - త్వ‌ర‌లో నిర్ణ‌యిస్తామ‌న్న ఎంఎన్ఎం అధ్య‌క్షుడు క‌మ‌ల్

ప్ర‌స్తుతం క‌ర్నాట‌కలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో బెంగ‌ళూరులో ప్ర‌చారం నిమిత్తం వెళ్లే విష‌య‌మై శ‌నివారం నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు క‌మ‌ల్‌హాస‌న్ చెప్పారు.

2024లో పోటీపై ఇంకా నో క్లారిటీ.. - త్వ‌ర‌లో నిర్ణ‌యిస్తామ‌న్న ఎంఎన్ఎం అధ్య‌క్షుడు క‌మ‌ల్
X

2024లో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఎంఎన్ఎం అధ్య‌క్షుడు క‌మ‌ల్‌హాస‌న్ చెప్పారు. కోయంబ‌త్తూరు నుంచి పోటీచేసేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింద‌ని, దీనిపై రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంద‌ని విలేక‌రులు క‌మ‌ల్‌ను ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న పైవిధంగా స్పందించారు. అయితే త్వ‌ర‌లో దీనిపై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు క‌మ‌ల్ చెప్పారు.

కోయంబ‌త్తూరులో శుక్ర‌వారం జ‌రిగిన ఎంఎన్ఎం కోయంబ‌త్తూరు, సేలం మండ‌లాల ఇన్‌చార్జిల స‌మావేశంలో క‌మ‌ల్‌హాస‌న్ పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న‌ విలేక‌రులనుద్దేశించి మాట్లాడారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీచేసే విష‌యంపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని, త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం క‌ర్నాట‌కలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో బెంగ‌ళూరులో ప్ర‌చారం నిమిత్తం వెళ్లే విష‌య‌మై శ‌నివారం నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు క‌మ‌ల్‌హాస‌న్ చెప్పారు. రాహుల్‌గాంధీ నిర్వ‌హించిన భార‌త్ జోడో యాత్ర‌లో ఆయ‌న‌తో క‌లిసి క‌మ‌ల్‌హాస‌న్ పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

First Published:  29 April 2023 4:58 AM GMT
Next Story