Telugu Global
National

రెండు బ‌స్సులు ఢీకొని ఆరుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి హింగోలి జిల్లాకు తిరిగి వస్తున్న బస్సు.. నాసిక్స్ వైపుగా వెళుతున్న మరో బస్సును ఢీకొట్టింది. ముందు వెళుతున్న ట్రక్కును అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

రెండు బ‌స్సులు ఢీకొని ఆరుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు
X

మ‌హారాష్ట్ర‌లోని బుల్దానా జిల్లాలో 25 మంది ప్ర‌యాణికులు బ‌స్సులోనే స‌జీవ‌ద‌హ‌న‌మైన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే అదే జిల్లాలో శ‌నివారం మ‌రో దారుణ ప్ర‌మాదం చోటుచేసుకుంది. రెండు ప్రైవేటు బ‌స్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మృతిచెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మ‌రో 32 మంది స్వ‌ల్ప గాయాల‌పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి హింగోలి జిల్లాకు తిరిగి వస్తున్న బస్సు.. నాసిక్స్ వైపుగా వెళుతున్న మరో బస్సును ఢీకొట్టింది. ముందు వెళుతున్న ట్రక్కును అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మల్కాపూర్ ప్రాంతంలోని నందూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జ‌రిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన‌వారిలో కొంత‌మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

First Published:  29 July 2023 6:47 AM GMT
Next Story