Telugu Global
National

మేం విడిపోలేదు.. సమయం లేకే దూరంగా ఉన్నాం.. షోయబ్ మాలిక్ క్లారిటీ

తనతోపాటు సానియా కూడా ప్రొఫెషనల్ గా చేసుకున్న ఒప్పందాల కారణంగా బిజీగా గడపాల్సి వస్తోందని వివరించాడు. అందువల్లే ఇటీవల రంజాన్ సందర్భంగా తామిద్దరం కలవలేకపోయామని క్లారిటీ ఇచ్చాడు.

మేం విడిపోలేదు.. సమయం లేకే దూరంగా ఉన్నాం.. షోయబ్ మాలిక్ క్లారిటీ
X

మేం విడిపోలేదు.. సమయం లేకే దూరంగా ఉన్నాం.. షోయబ్ మాలిక్ క్లారిటీ

ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విడాకుల ప్రక్రియ సాగుతోందని, అది పూర్తయ్యాక ఇద్దరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అటు షోయబ్ కానీ, ఇటు సానియా కానీ ఖండించలేదు.

ప్రస్తుతం షోయబ్ మాలిక్ పాకిస్తాన్ లో ఉంటుండగా, సానియా మీర్జా చాలాకాలంగా ఇండియాలోనే ఉంటోంది. వీరిద్దరూ కొన్ని నెలలుగా కలుసుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. చివరికి సానియా మీర్జా జన్మదిన వేడుకల్లో కూడా షోయబ్ పాల్గొనలేదు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ప‌క్కా అని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల రంజాన్ పండుగ జరుగగా.. అప్పుడు కూడా సానియా, షోయబ్ కలవలేదు. దీంతో వీరిద్దరూ విడిపోవడం ఖాయమని మరోసారి వార్తలు వస్తున్న నేపథ్యంలో షోయబ్ మాలిక్ స్పందించాడు. సానియా మీర్జా, తాను విడిపోవడం లేదని ప్రకటించాడు. తామిద్దరం కలిసి గడిపేందుకు సమయం దొరకడం లేదని చెప్పాడు. తనతోపాటు సానియా కూడా ప్రొఫెషనల్ గా చేసుకున్న ఒప్పందాల కారణంగా బిజీగా గడపాల్సి వస్తోందని వివరించాడు. అందువల్లే ఇటీవల రంజాన్ సందర్భంగా తామిద్దరం కలవలేకపోయామని క్లారిటీ ఇచ్చాడు.

మా ఇద్దరిలో ఎవరికి సమయం ఉన్నా ఇరుదేశాలకు వచ్చి వెళ్తుంటామని తెలిపాడు. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగు అవ్వాలని తాను కోరుకుంటున్నట్లు షోయబ్ చెప్పాడు. అటు భారత్ ఇటు పాకిస్తాన్ ఆటగాళ్లు ఇరుదేశాల మధ్య మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారని తెలిపాడు. ఇక రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు అయితే ఇండియా -పాక్ మధ్య జరిగే పోరు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారని షోయబ్ తెలిపాడు.

First Published:  25 April 2023 5:30 AM GMT
Next Story