Telugu Global
National

రిఫ్రిజిరేటర్‌ పేలి ఆరుగురు మృతి

పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి రిఫ్రిజిరేటర్‌ కంప్రెషర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు.

రిఫ్రిజిరేటర్‌ పేలి ఆరుగురు మృతి
X

అది ఆదివారం.. అందరూ ఇంటివద్దే ఉన్నారు.. అంతేకాదు, కాలక్షేపం కోసం అందరూ కలిసి టీవీ చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా భారీ పేలుడు. ఆ వెంటనే మంటలు చెలరేగి.. శరవేగంగా ఇల్లు అంతా అలుముకున్నాయి. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు.

పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి రిఫ్రిజిరేటర్‌ కంప్రెషర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మృతిచెందినవారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.

ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలసి ఆదివారం రాత్రి టీవీ చూస్తుండగా పెద్ద శబ్దంతో ఈ పేలుడు సంభవించింది. ఆ తర్వాత మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న యశేపాల్‌ గాయ్‌ (70), ఆయన కుమారుడు ఇంద్రపాల్‌ (41), కోడలు రుచి గాయ్‌ (40), వారి 14, 12, 10ఏళ్లలోపు వయసున్న ముగ్గురు చిన్నారులు మానస, దియా, అక్షయ్‌ మృతిచెందారు.

ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన ఇంద్రపాల్‌ సోమవారం నాడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు. పేలుడుకు గల అసలు కారణం తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ బృందం ఘటనా స్థలికి చేరుకుని శాంపిళ్లను సేకరించిందని పోలీసులు తెలిపారు.

First Published:  10 Oct 2023 2:40 AM GMT
Next Story