Telugu Global
National

'చంద్రమండలం - చాయ్ వాలా' ట్రోలింగ్ పై స్పందించిన ప్రకాష్ రాజ్

బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇస్తూ, వారికి మరింత మంట పెట్టారు ప్రకాష్ రాజ్. విద్వేషం, విద్వేషాన్ని మాత్రమే చూడగలదని అన్నారు. తాను కేరళ చాయ్ వాలా గురించి పోస్టింగ్ పెట్టానని, మరి ట్రోలింగ్ చేసిన చాయ్ వాలా ఎవరు..? అంటూ పరోక్షంగా మోదీపై సెటైర్లు పేల్చారు.

చంద్రమండలం - చాయ్ వాలా ట్రోలింగ్ పై స్పందించిన ప్రకాష్ రాజ్
X

సినీ నటుడు ప్రకాష్ రాజ్ చంద్రయాన్-3పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన మాత్రం తగ్గేది లేదంటున్నారు. తన వ్యాఖ్యలు తప్పు కాదంటూ మరోసారి మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జోక్ ని జోక్ లాగే చూడాలని, లేకపోతే అది తమపైనే అనుకోవాల్సి వస్తుందని చెప్పారు. గ్రో అప్ అంటూ ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు.


వివాదం ఎందుకు..?

చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్, విక్రమ్ ల్యాండర్ పై ఓ జోక్ పేల్చారు. చంద్రుడిపై నుంచి విక్రమ్ ల్యాండర్ పంపించిన తొలి ఫొటో ఇదేనంటూ ఆయన ఓ చాయ్ వాలా ఫొటోని ట్వీట్ చేశారు. దీంతో ప్రకాష్ రాజ్ పై విమర్శలు మొదలయ్యాయి. విద్వేషంతో ఆయన ఈ ఫొటో పెట్టారని మండిపడుతున్నారు నెటిజన్లు. ప్రత్యేకంగా చాయ్ వాలా ఫొటోని ట్వీట్ చేయడంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు.

ఈయన కేరళ చాయ్ వాలా..!!

బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇస్తూ, వారికి మరింత మంట పెట్టారు ప్రకాష్ రాజ్. విద్వేషం, విద్వేషాన్ని మాత్రమే చూడగలదని అన్నారు. తాను కేరళ చాయ్ వాలా గురించి పోస్టింగ్ పెట్టానని, మరి ట్రోలింగ్ చేసిన చాయ్ వాలా ఎవరు..? అంటూ పరోక్షంగా మోదీపై సెటైర్లు పేల్చారు. తాను చేసిన జోక్ ని సరిగా అర్థం చేసుకోలేదని, అలా అర్థం చేసుకోలేనివారు అది తమపైనే అనుకుంటారని అన్నారు. కాస్త ఎదగండి అంటూ మరింత వెటకారం జోడించారు.

First Published:  21 Aug 2023 1:13 PM GMT
Next Story