Telugu Global
National

రాహుల్ గాంధీకి బీహార్ కోర్టు నోటీసులు... ఏప్రిల్ 25న హాజరు కావాలని ఆదేశం

2019లో కర్నాటకలోని కోలార్‌లో జరిగిన రాజకీయ ర్యాలీలో రాహుల్ గాంధీ, . "దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుంది?" అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పాట్నా కోర్టులో కేసు నమోదైంది

రాహుల్ గాంధీకి బీహార్ కోర్టు నోటీసులు... ఏప్రిల్ 25న హాజరు కావాలని ఆదేశం
X

బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ వేసిన పరువు నష్టం కేసులో ఏప్రిల్ 25న బీహార్ రాజధాని పాట్నాలోని కోర్టుకు హాజరుకావాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. 2019లో కర్నాటకలోని కోలార్‌లో జరిగిన రాజకీయ ర్యాలీలో రాహుల్ గాంధీ, . "దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుంది?" అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పాట్నా కోర్టులో కేసు నమోదైంది

ఇదే అంశంపై గుజరాత్ లోని సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రాహుల్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. దోషిగా నిర్ధారించిన తర్వాత, రాహుల్ గాంధీ లోక్‌సభకు ఎంపీగా అనర్హుడయ్యారు.

కాగా ఏప్రిల్ 12న రాహుల్ గాంధీని తన ముందు హాజరుకావాలని ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆది దేవ్‌ మార్చి 18న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, బుధవారం విచారణ సందర్భంగా, మొత్తం రాహుల్ బృందం సూరత్ కేసుతో బిజీగా ఉందని పేర్కొంటూ మరో తేదీని డిఫెన్స్ న్యాయవాది కోరారు.

ఈ అంశంపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతామని, సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ తెలిపింది. రాహుల్ గాంధీ అనర్హత ప్రతిపక్ష శ్రేణుల మధ్య ఐక్యతను తీసుకురావడానికి సహాయపడిందని పార్టీ నాయకులు భావిస్తున్నారు, దాని పర్యవసానంగా 19 ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా అరుదైన ఐక్యతను ప్రదర్శించాయి.

First Published:  13 April 2023 2:46 AM GMT
Next Story