Telugu Global
National

కర్ణాటక అసెంబ్లీకి జూనియర్ ఎన్టీఆర్

గుండెపోటుతో మృతి చెందిన కన్నడ పవర్ స్టార్‌ పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక రత్న పురస్కారం అందజేయాలని కర్ణాటక ప్ర‌భుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఎన్టీఆర్‌కు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం పంపింది.

కర్ణాటక అసెంబ్లీకి జూనియర్ ఎన్టీఆర్
X

కొన్ని నెలల కిందట కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయనకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక అత్యున్నత పురస్కారం అయిన కర్ణాటక రత్న అందజేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతున్నారు. పునీత్ రాజ్ కుమార్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విషయం గురించి చాలా సార్లు ఎన్టీఆర్, పునీత్ పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు.

ఎన్టీఆర్‌ను పునీత్ తన సోదరుడిగా భావించేవారు. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని చెప్పేవారు. ఎన్టీఆర్ కూడా అంతే పునీత్‌పై ఎంతో అభిమానం చూపేవారు. అదే అభిమానంతో పునీత్ రాజకుమార్ నటించిన చక్ర వ్యూహ సినిమాలో ఎన్టీఆర్ ఒక పాట పాడారు. కాగా పునీత్ రాజ్ కుమార్ మరణం ఎన్టీఆర్‌ను తీవ్రంగా కలచివేసింది.

పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక రత్న పురస్కారం అందజేయాలని నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం వచ్చే నెల ఒకటో తేదీన జరగబోయే కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమంలో పునీత్ రాజ్ కుమార్ కుటుంబీకులకు ఈ పురస్కారాన్ని అందజేయనుంది. ఈ కార్యక్రమం కర్ణాటక విధాన సౌధలో జరగనుంది. ఎన్టీఆర్, పునీత్‌కు మధ్య ఉన్న అనుబంధం కారణంగా కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఎన్టీఆర్‌కు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం పంపింది. దీంతో వచ్చే నెల ఒకటో తేదీ జరగనున్న ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరుకానున్నారు.

First Published:  29 Oct 2022 11:03 AM GMT
Next Story