Telugu Global
National

కర్నాటక, మహారాష్ట్ర వివాదం తీర్చలేనోడు రష్యా ఉక్రెయిన్ యుద్దం ఆపుతాడట‌!

ప్రధాని మోడీ తన స్వంత దేశంలో రెండు రాష్ట్రాల మధ్య హింసకు కారణమైన వివాదాన్ని ఎందుకు పరిష్కరించడ‍లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఇది మంచి రాజకీయ నాయకుడి లక్షణం కాదని పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో ఆదివారం ఆయన వ్యాసం రాశారు.

కర్నాటక, మహారాష్ట్ర వివాదం తీర్చలేనోడు రష్యా ఉక్రెయిన్ యుద్దం ఆపుతాడట‌!
X

కొద్ది రోజులుగా నడుస్తున్న కర్నాటక , మహారాష్ట్ర సరిహద్దు వివాదాన్ని మోడీ సర్కార్ పట్టించుకోకపోవడం పట్ల శివసేన విరుచుకపడింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి మధ్యవర్తిత్వం చేస్తూ యుద్దం ఆపడానికిప్రయత్నిస్తున్నానని చెప్పుకుంటున్న ప్రధాని మోడీ తన స్వంత దేశంలో రెండు రాష్ట్రాల మధ్య హింసకు కారణమైన వివాదాన్ని ఎందుకుపరిష్కరించడ‍లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఇది మంచి రాజకీయ నాయకుడి లక్షణం కాదని పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో ఆదివారం ఆయన వ్యాసం రాశారు.

ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు పరిష్కరించకుంటే, న్యాయం కోసం ఎవరిని అశ్రయించాలని ఆయన ప్రశ్నించారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో బెళగావి, ఆ చుట్టుపక్కల మరాఠీ మాట్లాడే గ్రామాలను అక్కడి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కర్ణాటకలో కలిపేశారని రౌత్ ఆరోపించారు. అక్కడి మరాఠీ ప్రజలు చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నారని అక్కడి ప్రభుత్వం వారిపై అణిచివేత చర్యలకు పాల్పడుతోందని రౌత్ మండిపడ్డారు. ఈ సమస్య పరిష్కారానికి పార్లమెంటు ఒక పరిష్కారం సూచించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఎం బొమ్మై మహారాష్ట్ర ప్రజలకు, మహారాష్ట్రకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని, దానికి బదులు బెళగావిలోని మరాఠా మాట్లడే ప్రజల నేతలు, సంస్థలతో చర్చలు జరపాలని రౌత్ సూచించారు. కర్నాటకలో ప్రస్తుతం ఉన్న మహారాష్ట్ర మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలు తమవే అంటూ కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మై గట్టిగా వాదిస్తుంటే, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వాదన మాత్రం బలహీనంగా ఉందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.

First Published:  18 Dec 2022 5:41 PM GMT
Next Story