Telugu Global
National

కాంగ్రెస్ సీఎంను పొగడ్తలతో ముంచెత్తిన మోడీ

అశోక్ గెహ్లాట్ తన స్వంత పార్టీలో అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్ర అభివృద్దికి పాటుపడుతున్నారని మోడీ కితాబిచ్చారు. అశోక్ గెహ్లాట్ వంటి రాజకీయ నాయకులు చాలా అరుదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ సీఎంను పొగడ్తలతో ముంచెత్తిన మోడీ
X

రాజ‌స్థాన్‌ కాంగ్రెస్ లో కుమ్ములాటలు సాగుతూ, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై సచిన్ పైలట్ తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో ఆశ్చర్యంగా ప్రధాని అశోక్ గెహ్లాట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాజస్థాన్, జైపూర్ నుంచి తొలి వందే భారత్ రైలును ఈరోజు మోడీ ప్రారంభించారు. వ‌ర్చువ‌ల్‌ విధానంలో రైలును ప్రారంభించిన మోడీ.. ఈ స‍ందర్భంగా మాట్లాడుతూ గెహ్లాట్ ను కొనియాడారు.

గెహ్లాట్ తన స్వంత పార్టీలో అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని మోడీ కితాబిచ్చారు. గెహ్లాట్ వంటి రాజకీయ నాయకులు చాలా అరుదని ఆయన అన్నారు. ఎన్ని సమస్యలున్నా పక్కన పెట్టి ఈనాటి వందేభారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సైతం హాజరయ్యారని, అందుకు గెహ్లాట్ కు తాను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

అశోక్ గెహ్లాట్ తనకు మంచి స్నేహితుడని చెప్పిన మోడీ, తనతో ఉన్న స్నేహంపై నమ్మకం ఉంచిన మీకు ధన్యవాదాలు చెపుతున్నానని అశోక్ గెహ్లాట్ ను ఉద్దేశించి అన్నారు. మీ నమ్మకం నా బలం అని చెప్పారు. మిత్రత్వంపై మీకు ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు అని మోడీ అన్నారు.

First Published:  12 April 2023 12:35 PM GMT
Next Story