Telugu Global
National

మోడీ సర్కార్ దేశ ఆరోగ్య వ్యవస్థను నాశనం చేసింది : మల్లిఖార్జున్ ఖర్గే

దేశంలోని 19 ఎయిమ్స్‌లలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు.

మోడీ సర్కార్ దేశ ఆరోగ్య వ్యవస్థను నాశనం చేసింది : మల్లిఖార్జున్ ఖర్గే
X

కేంద్రంలోని మోడీ సర్కార్ దేశ ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం అసలు ఏమీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. కేంద్రంలోని మోడీ సర్కారుకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని ఖర్గే వ్యాఖ్యానించారు.

దేశంలోని 19 ఎయిమ్స్‌లలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. 'కేంద్రంలోని దోపిడీ సర్కార్ దేశ ఆరోగ్య వ్యవస్థను అనారోగ్యంగా మార్చేసింది. మోడీ మాట్లాడే ప్రతీ మాటలో అబద్ధాలు మాత్రమే ఉంటాయి. దేశవ్యాప్తంగా చాలా ఎయిమ్స్‌లను ఏర్పాటు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, నిజం ఏంటంటే దేశంలోని ఎయిమ్స్ అన్నీ తీవ్రంగా వైద్యులు, సిబ్బంది కొరతనుఎదుర్కుంటున్నాయి' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో బీజేపీ ప్రభుత్వం భారీ స్కామ్‌లకు పాల్పడిందని ఆరోపించారు. అయితే ప్రజలు ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వానికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని ట్విట్టర్‌లో ఖర్గే పేర్కొన్నారు.


First Published:  13 Aug 2023 9:04 AM GMT
Next Story