Telugu Global
National

ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లింలను టార్గెట్ చేస్తూ మళ్ళీ విద్వేష వ్యాఖ్యలు

కండిషన్ బెయిల్ పై రిలీజ్ అయ్యాక రాజాసింగ్ ముంబైలో జరిగిన ఓ ర్యాలీలో ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. అక్కడ అతనిపై కేసు కూడా నమోదయ్యింది. మళ్ళీ నిన్న ఆయన మహారాష్ట్రలోని అహ్మద్ న‌గర్ లో ముస్లింల పైకి హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లింలను టార్గెట్ చేస్తూ మళ్ళీ విద్వేష వ్యాఖ్యలు
X

ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింపై ఎన్ని కేసులు పెట్టినా, అరెస్టు చేసి జైలుకు పంపినా ఆయన తీరు మాత్రం మారడం లేదు. ఏ వర్గం వారిపైన కూడా విద్వేష వ్యాఖలు చేయొద్దని హైకోర్టు కండీషన్ పెట్టినప్పటికీ ఆయన వైఖరిలో కించిత్తు మార్పు కూడా రావడం లేదు.

కండిషన్ బెయిల్ పై రిలీజ్ అయ్యాక రాజాసింగ్ ముంబైలో జరిగిన ఓ ర్యాలీలో ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. అక్కడ అతనిపై కేసు కూడా నమోదయ్యింది. మళ్ళీ నిన్న ఆయన మహారాష్ట్రలోని అహ్మద్ న‌గర్ లో ముస్లింల పైకి హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

అహ్మద్‌నగర్‌లో హిందూ సంఘాలు నిర్వహించిన ఓ కార్యక్రమాల్లో పాల్గొన్న రాజాసింగ్, ''భారత్‌ 2026 నాటికి ‘అఖండ హిందూ దేశం’గా మారుతుంది. ఇది సాధువులు చెప్తున్న జోస్యం. హిందూ రాజ్యంలో రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు చేసుకునేందుకు వారికి లౌడ్‌ స్పీకర్లు కూడా దొరకవు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని, గోవధకు పాల్పడేవారిని సహించబోం. వారిని కొట్టాలనుకుంటే బజరంగ్‌దళ్‌లో చేరండి’’ అని మాట్లాడారు.

అక్కడితో ఆగలేదాయన ''మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ను అహిల్యాభాయ్‌ నగర్‌గా, హైదరాబాద్ ను భాగ్యనగర్‌గా మారుస్తాం ఈ పేర్లు మార్చడంపై చాలామంది బాధపడుతున్నారు. కొందరు మేము ఔరంగాబాద్‌లో పుట్టాం, అక్కడే చనిపోతాం అంటున్నారు. వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే.. మీరు ఔరంగాబాద్‌లోనే పుట్టినా శంభాజీనగర్‌లోనే చనిపోవాలి’’ అని రాజాసింగ్‌ అన్నారు.

రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు స్పంధించారు. ఆ కార్యక్రమ నిర్వాహకులపై, రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు.

First Published:  15 March 2023 3:00 AM GMT
Next Story