Telugu Global
National

ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టు ప్రాంగణంలోనే భార్యపై యాసిడ్ దాడి

పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న యాసిడ్ కోర్టు ప్రాంగణంలో అందరు చూస్తుండగానే భార్య ముఖంపై చల్లాడు. దీంతో ఆమె నొప్పితో విలవిలలాడింది. ఈ దాడిలో బాధిత మహిళ మెడ కింద తీవ్ర గాయాలయ్యాయి.

ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టు ప్రాంగణంలోనే భార్యపై యాసిడ్ దాడి
X

వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రియుడితో వెళ్లిపోయిన భార్యపై కోర్టు ప్రాంగణంలోనే భర్త యాసిడ్ తో దాడి చేశాడు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూర్ లో జరిగింది. శివకుమార్ అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తుండగా, అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివకుమార్ భార్య ఇటీవల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. వారం కిందట ఆమె భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ ఆగ్రహంతో రగిలిపోయాడు.

శివకుమార్ భార్య 2016లో జరిగిన ఓ చోరీ కేసులో నిందితురాలిగా ఉంది. ఈ కేసు విచారణకు భార్య కచ్చితంగా కోర్టుకు వస్తుందని భావించిన శివకుమార్ ఆమెపై యాసిడ్ దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక వాటర్ బాటిల్ లో యాసిడ్ పోసుకొని కోర్టు వద్దకు వచ్చాడు. అతడు అనుకున్నట్టే కేసు విచారణకు భార్య హాజరైంది.

పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న యాసిడ్ కోర్టు ప్రాంగణంలో అందరు చూస్తుండగానే భార్య ముఖంపై చల్లాడు. దీంతో ఆమె నొప్పితో విలవిలలాడింది. ఈ దాడిలో బాధిత మహిళ మెడ కింద తీవ్ర గాయాలయ్యాయి. కోర్టు వద్ద ఉన్నవారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా 80 శాతం గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కాగా, భార్యపై యాసిడ్ దాడి అనంతరం పారిపోతున్న శివకుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంద‌ని ఏకంగా కోర్టు ప్రాంగణంలో అందరూ చూస్తుండగా భార్యపై యాసిడ్ తో దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది.

First Published:  24 March 2023 2:35 AM GMT
Next Story