చెట్టు నరికాడని.. రూ.లక్ష ఫైన్ వేశారు
స్థానిక 14వ వార్డులోని దాదాపు 40 అడుగుల ఎత్తయిన చెట్టును నరికేశాడు. అంతటితో ఆగక మరో చెట్టును కూడా నరికేస్తుండటంతో గుర్తించిన మున్సిపల్ అధికారుల బృందం అతన్ని అడ్డుకుంది.
BY Telugu Global12 Jun 2023 1:18 AM GMT
X
Telugu Global Updated On: 12 Jun 2023 1:18 AM GMT
మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో ఓ వ్యక్తి చెట్టును నరికేశాడని అతనికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భారీ జరిమానా విధించారు. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ వార్డులో శనివారం ఈ ఘటన జరిగింది. లాతూర్ నగరానికి చెందిన ఒక వ్యక్తి స్థానిక 14వ వార్డులోని దాదాపు 40 అడుగుల ఎత్తయిన చెట్టును నరికేశాడు. అంతటితో ఆగక మరో చెట్టును కూడా నరికేస్తుండటంతో గుర్తించిన మున్సిపల్ అధికారుల బృందం అతన్ని అడ్డుకుంది.
చెట్టు నరికివేతపై అతన్ని ప్రశ్నించగా, సరైన సమాధానం చెప్పలేదు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అతనికి నోటీసులు జారీ చేశారు. అనంతరం అతనికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు. అంతటితో ఆగక చెట్టును నరికివేయడంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
Next Story