Telugu Global
National

మోడీ నుంచి దేశాన్ని కాపాడండంటూ... పార్లమెంటు ముందు నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

అతను ఆత్మహత్యకు ప్రయత్నించడం వెనుక కారణం ఏంటనేది ఇంకా నిర్దారణ కాలేదు. అయితే అతను ఇచ్చిన నినాదాలను బట్టి బీజేపీ సర్కార్ పై తీవ్ర అసంత్రుప్తి, అసహనంతో ఉన్నాడనేది అర్దమవుతోంది. రాజ్ కుమార్ శర్మ ఆత్మహత్యాయత్నంపై విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

మోడీ నుంచి దేశాన్ని కాపాడండంటూ... పార్లమెంటు ముందు నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
X

పార్లమెంట్ భవనం సమీపంలో గురువారం ఓ వ్యక్తి శరీరానికి నిప్పంటించుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఢిల్లీలోని రోహిణి నివాసి రాజ్ కుమార్ శర్మ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు చేశాడ‌ని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నరేంద్ర మోడీ నుంచి ఈ దేశాన్ని రక్షించాలంటూ ఆయన నినాదాలు చేశారు.

రాజ్ కుమార్ శర్మను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు, అతను "దేశ్ కో బచా లో (దేశాన్ని రక్షించండి)" అని అరవడం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అతను ఆత్మహత్యకు ప్రయత్నించడం వెనుక కారణం ఏంటనేది ఇంకా నిర్దారణ కాలేదు. అయితే అతను ఇచ్చిన నినాదాలను బట్టి బీజేపీ సర్కార్ పై తీవ్ర అసంత్రుప్తి, అసహనంతో ఉన్నాడనేది అర్దమవుతోంది. రాజ్ కుమార్ శర్మ ఆత్మహత్యాయత్నంపై విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

First Published:  6 April 2023 2:37 PM GMT
Next Story