Telugu Global
National

అత్తను కొట్టి చంపిన కోడలు..చూస్తూ నిల్చున్న కొడుకు

మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్ జిల్లా పిప్రిపుర గ్రామంలో కుటుంబ కలహాలతో మున్నీదేవి (55) అనే వృద్ధురాలిని తన పెద్ద కోడలు కర్రలతో, రాళ్లతో దారుణంగా కొట్టింది.

అత్తను కొట్టి చంపిన కోడలు..చూస్తూ నిల్చున్న కొడుకు
X

ఈ భూమ్మీద నిస్వార్థమైన ప్రేమ ఉందంటే అది తల్లిదండ్రులదే. తల్లి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. పిల్లలకు కష్టం వస్తే తన కష్టంలా భావించి తోడుంటుంది. అలాంటి ఓ తల్లిని కోడలు చితకబాదుతుంటే కన్న కొడుకు చూస్తూ నిల్చోవడం విస్మయానికి గురి చేసింది. కోడలు కొట్టిన దెబ్బలకు ఆ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మధ్యప్రదేశ్‌‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్ జిల్లా పిప్రిపుర గ్రామంలో కుటుంబ కలహాలతో మున్నీదేవి (55) అనే వృద్ధురాలిని తన పెద్ద కోడలు కర్రలతో, రాళ్లతో దారుణంగా కొట్టింది. ఇది జరుగుతున్న టైంలో పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నా.. తల్లిని చావగొడుతుంటే కనీసం అడ్డుకోకుండా చూస్తూ నిల్చున్నాడు. తీవ్ర గాయాలపాలైన మున్నీ దేవిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. గతంలో మున్నీదేవి కూడా పెద్ద కోడలిపై దాడి చేసిందని సమాచారం. అదే కోపంతో ఇప్పుడు ఆమెపై అత్తని కొట్టి చప్పినట్లు చెబుతున్నారు.

First Published:  17 April 2024 7:36 AM GMT
Next Story