Telugu Global
National

గోడి మీడియాతో పోరాడదాం రండి...ప్రజలకు రవీష్ కుమార్ పిలుపు...నెటిజనుల మద్దతు

గోడి మీడియా భానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ సీనియర్ జర్నలిస్టు రవీష్ కుమార్ ప్రజలకు పిలుపినిచ్చారు. రవీష్ కుమార్ అఫీషియల్ అనే తన యూట్యూబ్ ఛానల్ ఇక తన కొత్త చిరునామా అని నెటిజనులకు ఆయన తెలిపారు.

గోడి మీడియాతో పోరాడదాం రండి...ప్రజలకు రవీష్ కుమార్ పిలుపు...నెటిజనుల మద్దతు
X

NDTV కి రాజీనామా చేసిన తర్వాత సీనియర్ జర్నలిస్టు రవీష్ కుమార్ కు సోషల్ మీడియాలో నెటిజనుల నుండి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. ప్రపంచ ధనికుడికి కూడా అమ్ముడుపోని వెన్నెముక గల హీరో అని నెటిజనులు పొగుడుతున్నారు. అతను ఇప్పటి వరకు NDTVలో హోస్ట్ చేసిన 'ప్రైమ్ టైం విత్ రవీష్ కుమార్' కార్యక్రమం పై నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ని బెధిరింపులు వచ్చినా నిజాన్ని నిర్భయంగా చెప్పిన జర్నలిస్టు అని ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రవీష్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. గోడి మీడియా భానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ ఆయన ప్రజలకు పిలుపినిచ్చారు. రవీష్ కుమార్ అఫీషియల్ Ravish Kumar Official అనే తన యూట్యూబ్ ఛానల్ ఇక తన కొత్త చిరునామా అని నెటిజనులకు తెలిపారు.

''ప్రియమైన ప్రజానీకానికి,

నా మనసులో మీరందరూ ఉన్నారు. మీ ప్రేమే నా సంపద. ఇప్పటి వరకు మీతో నేను సుదీర్ఘమైన సంభాషణను చేశాను. ఇకపై యూట్యూబ్ ఛానెల్లో అదే పని చేస్తాను. ఇది నా కొత్త చిరునామా. గోడి మీడియా బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలి.

మీ

రవీష్ కుమార్''

అని ఆయన ట్వీట్ చేశారు. రవీష్ చేసిన ఈ ట్వీట్ కు నెటిజనుల నుండి ఊహించని మద్దతు లభిస్తోంది. ఆయనకు మద్దతుగా నెటిజనులు ట్వీట్లు చేస్తున్నారు.

''గతంలో మీ పోరాటానికి మద్దతుగా ఒక పెద్ద సంస్థ ఉండేది. ఇప్పుడు మీరు ఒంటరిగా పోరాడాలి. అయినా మీరు పోరాటం కొనసాగించాలి. ఈ దేశ ప్రజలు మీతోనే ఉన్నారు. మీ పోరాటానికి తెలంగాణ అండగా నిలుస్తుంది'' అని టీఆరెస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు.

First Published:  1 Dec 2022 5:49 AM GMT
Next Story