Telugu Global
National

జిలేబీ బాబా దుర్మార్గం...120 మంది మహిళలపై అత్యాచారం!

జిలేబీ బాబా దుర్మార్గం...120 మంది మహిళలపై అత్యాచారం!
X

జలేబీ బాబా అసలు పేరు అమరవీర్. 20 ఏళ్ల క్రితం పంజాబ్‌లోని మాన్సా నుంచి హర్యానాలోని తోహానాకు వచ్చాడు. తోహాన రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణం పెట్టాడు. కొంత కాలానికి అతని భార్య మరణించింది. ఆతర్వాత అతను హటాత్తుగా మాయమైపోయాడు. రెండు సంవత్సరాల తర్వాత తిరిగి తొహానాకు వచ్చాడు. తనకు తాంత్రిక విద్యలు వచ్చునని, దయ్యాలు, భూతాలు తొలగిస్తానని, సమస్యలేమున్నా సరే తీర్చేస్తానని ప్రచారం చేసుకొని జనాలను నమ్మించాడు. ఆ తర్వాత జిలేబీ బాబాగా పేరు మార్చుకొని తంత్ర విద్య వ్యాపారాన్ని ప్రారంభించాడు. బాబా బాలక్ నాథ్ గుడిలో పూజారిగా కూడా పని చేయడం మొదలు పెట్టాడు. నమ్మి తన దగ్గరికి వచ్చిన మహిళలను ట్రాప్ చేసి అత్యాచారానికి పాల్పడేవాడు.

తాంత్రిక పూజల పేరుతో వారిని నమ్మించి వారికిమత్తు మందు ఇచ్చి వారిపై అత్యాచారానికి ఒడిగట్టేవాడు. పైగా దానిని వీడియోలు కూడా తీసి వారిని బెదిరించేవాడు. వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజేవాడు. తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు. ఇలా ఈ జిలేబీబాబా చేతుల్లో 120 మందికి పైగా మహిళలు బలయ్యారు.

ఇతను ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో బహిర్గతమయ్యింది. దాంతో ఇతని చేతుల్లో బలైన పలువురు మహిళలు ముందుకు వచ్చి పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు ఇతని స్థావరం పై దాడి చేసి అతని మొబైల్ ఫోన్ నుండి 120 సెక్స్ వీడియో క్లిప్పింగ్‌లను, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.

ఇతని పై విచారణ జరిపిన హర్యాణా కోర్టు నిన్న అతన్ని దోషిగా నిర్దారించింది. ఇక శిక్ష విధించాల్సి ఉంది.

First Published:  10 Jan 2023 2:50 AM GMT
Next Story