Telugu Global
National

రాయ్ పూర్ వ‌న్డేలో కివీస్ పై భారత్ ఘన విజయ‍ం...2.౦ తో సిరీస్ కైవసం

కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో రాణించాడు.ఆయన‌ 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, మరో ఓపెనర్ శుభమన్ గిల్ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

రాయ్ పూర్ వ‌న్డేలో కివీస్ పై భారత్ ఘన విజయ‍ం...2.౦ తో సిరీస్ కైవసం
X

హైదరాబాద్ లో జరిగిన మొదటి వండే లో న్యూజిలాండ్ పై విజయం సాధించిన భారత్, రాయ్ పూర్ లో జరిగిన రెండో వండే లో అదే జోరు కొనసాగించింది. ఈ రోజు జరిగిన రెండొ వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆటగాళ్ళు భారత్ బౌలర్ల ధాటికి 108 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాదించింది.

కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో రాణించాడు.ఆయన‌ 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, మరో ఓపెనర్ శుభమన్ గిల్ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 11 పరుగులు చేసి అవుటయ్యాడు.

రెండు వండేల్లో విజయం సాధించిన భారత్ 2-0తో సిరీస్ ను స్వంతం చేసుకుంది. ఇక నామ మాత్రంగా మారిన చివరి వన్డే ఈ నెల 24న ఇండోర్‌లోని హోల్కార్ క్రికెట్ స్టేడియంలో జరగుతుంది.

First Published:  21 Jan 2023 1:58 PM GMT
Next Story