Telugu Global
National

యూపీ సీఎం యోగిని త్వరలోనే చంపేస్తాం.. డయల్ 112కు గుర్తులేని వ్యక్తి మెసేజ్

అతిక్ అహ్మద్ హత్య తర్వాత యూపీ సీఎం యోగి తీరుపై అతిక్ అహ్మద్ వర్గం కూడా గుర్రుగా ఉంది. రంజాన్ సందర్భంగా ప్రార్థనలకు హాజరైన కొంతమంది ఆ వర్గానికి చెందిన వ్యక్తులు యోగికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

యూపీ సీఎం యోగిని త్వరలోనే చంపేస్తాం.. డయల్ 112కు గుర్తులేని వ్యక్తి మెసేజ్
X

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను త్వరలో చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తి డయల్ 112కు మెసేజ్ పంపడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మెసేజ్ పంపిన‌ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మామూలుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు వచ్చాయి.

అయితే ఈసారి మాత్రం ఉత్తరప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు వేరు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే అతిక్ అహ్మద్ సోదరులను కొందరు దుండగులు కాల్చి చంపారు. అయితే కొంతమంది రౌడీషీటర్లను ప్రభుత్వమే ఉసిగొల్పి అతిక్ అహ్మద్ ను చంపించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

అతిక్ అహ్మద్ హత్య తర్వాత యూపీ సీఎం యోగి తీరుపై అతిక్ అహ్మద్ వర్గం కూడా గుర్రుగా ఉంది. రంజాన్ సందర్భంగా ప్రార్థనలకు హాజరైన కొంతమంది ఆ వర్గానికి చెందిన వ్యక్తులు యోగికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగికి అధికారులు భద్రత పెంచారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో యోగిని త్వరలో చంపుతామని డయల్ 112కు బెదిరింపు మెసేజ్ రావడం కలకలం రేపింది. ఈనెల 23వ తేదీ రాత్రి 8: 22 గంటలకు డయల్ 112 హెడ్ క్వార్టర్స్ సోషల్ మీడియా వాట్సప్ డెస్క్ లో 9151400148 నంబరుకు ముఖ్యమంత్రిని చంపేస్తామని బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసి షాక్ అయిన ఆపరేషన్ కమాండర్ అధికారులు బెదిరింపు మెసేజ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై గోల్ప్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

First Published:  25 April 2023 6:48 AM GMT
Next Story