Telugu Global
National

పార్కింగ్ వివాదం..భార్య,కొడుకు ముందే హత్య

దాడి జరిగిన కాసేపటికే సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు.

పార్కింగ్ వివాదం..భార్య,కొడుకు ముందే హత్య
X

పార్కింగ్‌ విషయంలో తలెత్తిన వివాదం కాస్తా ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఈ దారుణ ఘటన సౌత్‌ ఈస్ట్ ఢిల్లీలోని సరితా విహార్‌లో జరిగింది. బాధితుడు అరవింద్‌ మండల్‌ను భార్య, కొడుకు ముందే అత్యంత దారుణంగా పొడిచారు దుండగులు. అరవింద్‌ను హాస్పిటల్‌కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది.

సౌత్‌ఈస్ట్‌ ఢిల్లీలోని సరితా విహార్‌లో నివాసం ఉండే అరవింద్‌ మండల్‌ తన కొడుకును స్కూల్‌ నుంచి తీసుకువస్తుండగా.. మనోజ్‌ హల్దర్‌ అనే వ్యక్తితో గొడవ జరిగింది. తర్వాత వివాదం సద్దుమణగడంతో ఇంటికి వెళ్లిపోయాడు అరవింద్‌. అయితే రాత్రి 9.30 గంటలకు అరవింద్‌ ఇంటికి ఆరుగురు వ్యక్తులు బైక్స్‌పై వచ్చారు. అరవింద్‌ను ఇంట్లో నుంచి లాక్కొచ్చి కత్తులతో పొడిచారు. అతని భార్య రేఖా మండల్‌పైనా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అరవింద్‌ను హాస్పిటల్‌ తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

దాడి జరిగిన కాసేపటికే సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. వీరంతా సరితా విహార్‌లోనే నివాసం ఉంటారని తెలుస్తోంది.

First Published:  17 Sep 2023 10:35 AM GMT
Next Story