Telugu Global
National

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పుడర్థమైంది.. సెహ్వాగ్ సెటైరికల్ ట్వీట్ వైరల్

ఈ సినిమాపై వీరేంద్ర సెహ్వాగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఆదిపురుష్ చూసిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అర్థమైంది.. అని ట్వీట్ చేశాడు.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పుడర్థమైంది.. సెహ్వాగ్ సెటైరికల్ ట్వీట్ వైరల్
X

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సూప‌ర్‌హిట్ సినిమా బాహుబలి. ఈ సినిమా మొదటి భాగంలో కట్టప్ప బాహుబలిని చంపుతాడు. అసలు కట్టప్ప బాహుబలిని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో పార్ట్-2 వచ్చే వరకు వెయిట్ చేయండి.. అని దర్శకుడు రాజమౌళి సస్పెన్స్ లో పెట్టాడు. ఈ సస్పెన్స్ అప్పట్లో ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళింది. ప్రేక్షకులు బాహుబలి పార్ట్-2 వచ్చిన తర్వాత ఆ సస్పెన్స్ ఏంటో సినిమా చూసి తెలుసుకున్నారు.


అయితే.. ఇప్పుడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చిందో కొత్త కారణాన్ని వెల్లడించాడు. సెహ్వాగ్ మామూలుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. సందర్భాన్ని బట్టి దేనిపై అయినా సునిశిత విమర్శలు చేయడంలో, సెటైర్ వేయడంలో దిట్ట. ప్రభాస్ తాజాగా ఆదిపురుష్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా విమర్శలు వచ్చాయి. అది అసలు రామాయణమే కాదని.. ఏదో హాలీవుడ్ మూవీస్‌లా ఉందని పలువురు విమర్శించారు.

రావణాసురుడు గెటప్ పై ట్రోల్స్ వచ్చాయి. ఇక డైలాగ్ రైటర్‌ను ప్రేక్షకులు ఒక ఆట ఆడుకున్నారు. ఆదిపురుష్‌పై విమర్శలు తీవ్రం అవ్వ‌డంతో ఈ సినిమా అసలు రామాయణమే కాదని మేకర్స్ ప్రకటించారు. రామాయణంలోని కొన్ని పాయింట్లు తీసుకుని ఆదిపురుష్ సినిమా చేసినట్లు చెప్పారు. మేకర్స్ ఈ ప్రకటన చేసిన తర్వాత ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత నెగిటివిటీ పెరిగింది.

కాగా, తాజాగా ఈ సినిమాపై వీరేంద్ర సెహ్వాగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఆదిపురుష్ చూసిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అర్థమైంది.. అని ట్వీట్ చేశాడు. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను ఒప్పుకున్నందుకే కట్టప్ప చంపేశాడు.. అనే అర్థం వచ్చేలా సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First Published:  25 Jun 2023 9:23 AM GMT
Next Story