Telugu Global
National

గుడ్ న్యూస్.. EPF వడ్డీ రేటు పెరిగింది

సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది.

గుడ్ న్యూస్.. EPF వడ్డీ రేటు పెరిగింది
X

ఈపీఎఫ్ ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.25 శాతంగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (CBT) ఖరారు చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15శాతంగా నిర్ణయించారు. అంతకు ముందు 2021-22లో 8.10శాతం వడ్డీ చెల్లించారు. గత మూడేళ్లలో ఇదే అత్యధికం.

సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

పదేళ్లలో ఈపీఎఫ్‌ వడ్డీ రేట్లు ఇలా..

2013-14 : 8.75 శాతం

2014-15 : 8.75 శాతం

2015-16 : 8.8 శాతం

2016-17 : 8.65 శాతం

2017-18 : 8.55 శాతం

2018-19 : 8.65 శాతం

2019-20 : 8.5 శాతం

2020-21 : 8.5 శాతం

2021-22 : 8.10 శాతం

2022-23 : 8.15 శాతం

First Published:  10 Feb 2024 6:37 AM GMT
Next Story